బీచ్ అభివృద్ధికి నిధుల కొరత లేదు
Published Friday, 3 June 2016మచిలీపట్నం, జూన్ 2: మంగినపూడి బీచ్ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు ఉన్నాయని, త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మంగినపూడి బీచ్ను పరిశీలించిన అనంతరం స్థానిక ఆర్అండ్బి అతిధిగృహంలో మంత్రి కొల్లు రవీంద్రతో భేటీ అయ్యారు. మంగినపూడి బీచ్ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి రవీంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. మంగిపూడి బీచ్ను అభివృద్ధి పర్చేందుకు తగినన్ని నిధులు ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ ప్రసాద్ మంత్రి రవీంద్రకు హామీ ఇచ్చారు.