నైజీరియాలో హైకమిషనర్గా నాగభూషణరెడ్డి
Published Friday, 3 June 2016హైదరాబాద్/కడప, జూన్ 2: ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి బొల్లవరం నాగభూషణరెడ్డి నైజీరియాలో భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా పొద్దుటూరు. ఆయన తండ్రి రామసుబ్బారెడ్డి పొద్దుటూరులో ప్రముఖ వైద్యుడు. ప్రస్తుతం నాగభూషణరెడ్డి జెనీవాలోని పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రాల ట్రాన్స్పోర్టు అధికారిగా కూడా పని చేశారు.