జగన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న టిడిపి
Published Friday, 3 June 2016అనంతపురం, జూన్ 2 : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం కిష్టిపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఇందులో భాగంగా కిష్టిపాడు నుంచి రాయలచెరువు వెళ్తున్న జగన్ కాన్వాయికు స్థానిక టిడిపి నాయకులు అడ్డుకునేందుకు రోడ్డును దిగ్బంధించారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్ విజ్ఞత మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం కూడా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
5న వైకాపా ధర్నా.. హాజరు కానున్న జగన్