నవ్యాంధ్రకోసం అహర్నిశలు కృషి చేద్దాం
Published Friday, 3 June 2016కడప(క్రైమ్), జూన్ 2:తెలుగు రాష్ట్రాలు విడిపోయి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజలందరూ అహర్నిశలు కృషి చేస్తూ నవ్యాంద్ర నిర్మాణానికి పాటుపడాలని జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పో లీసు అధికారులతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర కోసం అహర్నిశలు కృషి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. రాష్టవ్రిభజన ప్రజలు కోరుకున్నది కాకపోయినా దీన్ని ఒక పీడ కలగా మరచిపోవాలన్నారు.