ఘనంగా నవ నిర్మాణ దీక్ష
Published Friday, 3 June 2016భీమవరం, జూన్ 2: భీమవరం పట్టణంలో నవ నిర్మాణదీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ దీక్ష సాగనుంది. గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి నియోజకవర్గంలో నవనిర్మాణ దీక్షను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. సిఎం చంద్రబాబుతో పాటు ఎవరి స్థాయిలో వారు కష్టపడితే గ్రామ, పట్టణం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్నారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ భీమవరం మున్సిపాల్టీలో రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. భీమవరం ఎంపిడిఒ వై.