రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
Published Friday, 3 June 2016భట్టిప్రోలు, జూన్ 2: పదవ తరగతి మార్కుల జాబితా తెచ్చుకునేందుకు పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ సంఘటన మండలంలోని పల్లెకోనలో జరిగింది. గ్రామానికి చెందిన ఆర్ పిచ్చమ్మ (15) అనే విద్యార్థిని అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. మార్కుల జాబితా తెచ్చుకునేందుకు గురువారం ఉదయం తన సోదరుడు రాధా ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్క మార్జిన్లో ద్విచక్ర వాహనం జారి పడిపోయింది.