ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
Published Tuesday, 31 May 2016ఖానాపూర్ రూరల్, మే 30: మినీ మహానాడు కావడంతో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేయడం మండలంలో సంచలనంగా మారింది. మండలంలోని బాదన్కుర్తి రహదారిపై సుర్జాపూర్ శివారులోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి నిప్పంటించారు. సోమవారం విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు విగ్రహం వద్ద గల రహదారిపై బైఠాయించి దుండగులను వెంటనే అరెస్ట్చేయాలని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.