గూడులేని పేదలకు ఇళ్ల నిర్మాణం
Published Tuesday, 31 May 2016బీర్కూర్, మే 30: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గూడు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంతో లబ్ధి చేకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకు ముందు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65వేల ఇళ్ల నిర్మాణానికి గాను 4000కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు.