జిల్లాలో లక్ష ఫారంపాండ్లు
Published Tuesday, 31 May 2016కనగానపల్లి, మే 30: మండల పరిధిలోని పర్వతదేవరపల్లిలో రైతుల పొలాల్లో ఏర్పాటుచేసిన నీటి కుంటలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ గర్భ జలాలు పెంపొందించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్ష ఫారంపాండ్లు నిర్మాణాలను చేపట్టిందన్నారు. పర్వతదేవరపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య పొలంలో నిర్మించిన ఫారంపాండ్ శనివారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నిండి జల కళను సంతరించుకుంది. దీంతో మంత్రి పరిటాల సునీతతోపా టు డ్వామా పిడి నాగభూషణం, ఆర్డిఓ బాలానాయక్లు సోమవారం సందర్శించారు.