-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కొలంబో, మార్చి 11: శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న నిదహాస్ ట్రోఫీ టీ-20 ఇంటర్నేషనల్ ముక్కోణపు టోర్నీలో భాగంగా సోమవారం ఆతిధ్య జట్టుతో జరిగే నాలుగో మ్యాచ్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా తలపడుతుంది. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన భారత జట్టు ఇపుడు జరుగబోయే మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో కసిగో రబడ-స్మిత్ల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికా బౌలర్ రబడపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశముంది. రబడ వేసిన బంతికి స్మిత్ ఎల్బిడబ్ల్యు అయ్యాడు. దీంతో అత్యుత్సాహంతో రబడ, స్మిత్ వద్దకు దూకుడుగా వచ్చినప్పుడు ఇద్దరి భుజాలు పరస్పరం తాకాయి.
క్రిస్ట్చర్చ్, మార్చి 10: జానీ బెయిర్స్టో అద్భుత సెంచరీతో శనివారం ఇక్కడి హేగ్లే ఓవల్ స్టేడియంలో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో న్యూజిలాండ్ 3-2 తేడాతో ఓటమిని చవిచూసింది.
ఇఫొ(మలేసియా), మార్చి 10: ప్రతిష్టాత్మక అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. భారత్ 4-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థి ఐర్లాండ్పై విజయం సాధించింది. భారత్ బదులు తీర్చుకుని సత్తాచాటింది. శుక్రవారం ఏ జట్టు చేతిలో ఓడిపోయి పతక ఆశలను ఆవిరి చేసుకుందో శనివారం అదే జట్టుపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది.
ముంబయి, మార్చి 10: ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకుంటున్న టీ-20 క్రికెట్ టోర్నమెంట్లు అభిమానులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా టీ-20 ముంబయి లీగ్ మొదటి సీజన్ ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. ఈ మేరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇండియన్ వెల్స్(యూఎస్), మార్చి 10: భారత్కు చెందిన టెన్నిస్ ఆటగాడు ప్రపంచ 110వ ర్యాంకర్ యుకీ బాంబ్రీ ఇక్కడ జరుగుతున్న బీఎన్బీ పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో మొదటి రౌండ్లో గెలుపొందాడు. ఫ్రెంచ్కి చెందిన ప్రఖ్యాత స్టార్ ఆటగాడు నికోలస్ మహత్, ప్రపంచ నెంబర్ 101 ర్యాంకర్ను 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో 7-5, 6-3 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.
న్యూఢిల్లీ, మార్చి 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ సంవత్సరం ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా, అనందంగా ఉందని ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
విశాఖపట్నం, మార్చి 10: జాతీయ సీనియర్ ట్రయాథ్లాన్ చాంపియన్షిప్ ఈనెల 11వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ పోటీలు స్థానిక బీచ్ రోడ్డులో నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 110 మంది ట్రయథ్లెట్లు ఈ పోటీలో పాల్గొనడానికి రానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. భారత ట్రయాథ్లాన్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలో 1.5 కిమీ స్విమ్మింగ్, 40 కిమీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ, మార్చి 10: గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు రెస్ట్ఫా ఇండియా జట్టులో చోటుదక్కింది. ఇరానీ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో అశ్విన్కు చోటు కల్పించినట్టు శనివారం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పేర్కొంది. కండరాల నొప్పితో బాధపడుతున్న జడేజాకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
కొలంబో, మార్చి 10: శ్రీలంక క్రికెటర్ రమిత్ రంబుక్వెల్లా తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. తాగి వాహనం నడపడమే కాకుండా తమపై దాడి చేశాడన్న యూనివర్సిటీ విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ధృవీకరించారు. ఆదివారం ఆయనను అలుత్కడే మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 18 నెలల కాలంలో రమిత్ అరెస్ట్ కావడం ఇది రెండోసారి.