-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లాహోర్, సెప్టెంబర్ 11: పాకిస్తాన్ క్రికెట్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. త్వరలోనే హోం సిరీస్లు స్వదేశంలోనే జరుగుతాయన్న నమ్మకం అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారుల్లో, ఇటు అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఏడు దేశాలకు చెందిన ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు మూడు టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్లను పాకిస్తాన్ జట్టుతో ఆడనుండడం అక్కడి క్రికెట్కు కొత్త ఊపునిస్తున్నది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్తో మంగళవారం జరిగే వామప్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్కు హాజరవుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్. భారత్తో ఆసీస్ జట్టు ఐదు వనే్డలు, మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది
న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన అమెరికా క్రీడాకారిణి స్లొయెన్ స్టెఫెన్స్ (కుడి). ఫైనల్లో ఆమె తన దేశానికే చెందిన మాడిసన్ కీస్ (ఎడమ)ను ఓడించింది.
లిమా, సెప్టెంబర్ 10: ఒలింపిక్స్ హక్కులపై అధికార ముద్ర వేయడంతోపాటు, వివిధ అంశాలను చర్చించి, తీర్మానాలను ఆమోదించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) వారం రోజుల సర్వసభ్య సమావేశం సోమవారం ఇక్కడ మొదలుకానుంది. 2024 ఒలింపిక్స్ను పారిస్కు, 2028 ఒలింపిక్స్ను లాస్ ఏంజిల్స్కు ఇప్పటికే ఐఒసి ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూయార్క్, సెప్టెంబర్ 10: అమెరికా క్రీడాకారిణి స్లొయేన్ స్టెఫెన్స్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ చాంపియన్గా అవతరించింది. తుది పోరులో తన దేశానికే చెందిన సన్నిహిత స్నేహితురాలు మాడిసన్ కీస్ను 6-3, 6-0 తేడాతో చిత్తుచేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 83వ స్థానంలో ఉన్న స్టెఫెన్స్ సుమారు 61 నిమిషాలు జరిగిన పోరులో 16వ ర్యాంకర్ మాడిసన్ కీస్పై గెలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు టీమిండియాను భారత జాతీయ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రొటేషన్ విధానాన్ని అనుసరించి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. శ్రీలంకతో జరిగిన వనే్డ, టి-20 సిరీస్లకు ఎంపిక కాని ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ మళ్లీ జట్టులోకి వచ్చారు.
చెన్నై, సెప్టెంబర్ 10: భారత్తో జరగబోయే వనే్డ సిరీస్ జట్టులోని ప్రతి ఒక్కరి సామర్థ్యానికి పరీక్ష పెడుతుందని సహచరులకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హెచ్చరించాడు. భారత్ను ఓడిస్తే, ఆసీస్ చరిత్రలోనే అత్యుత్తమ క్రికెటర్లుగా నిలిచిపోతారని ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జట్టు సభ్యులకు స్మిత్ సూచించాడు.
యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన జెమీ ముర్రే , మార్టినా హింగిస్ జోడీ.
వీరు ఫైనల్లో చాంగ్ హవో చింగ్, మైఖేల్ వీనస్ జోడీపై విజయం సాధించారు
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ను స్నేహితుల సవాల్గా పేర్కోవచ్చు. ఈ పోరులో అమీతుమీ తేల్చుకోవడానికి బరిలోకి దిగిన అమెరికన్లు స్లొయెన్ స్టెఫెన్స్, మాడిసన్ కీస్ మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని చాలాసేపు అలానే ఉండిపోయారు. అనంతరం, బహుమతుల ప్రదానం మొదలయ్యే వరకూ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు.
చెనైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఈనెల 17న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మొదటి వనే్డ మ్యాచ్ టికెట్ను ఎంతో సంతోషంతో మీడియాకు చూపుతున్న ఓ మహిళ. స్టేడియం వద్ద కౌంటర్లలో టికెట్ల అమ్మకాన్ని ఆదివారం ప్రారంభించారు. డిమాండ్ భారీగా ఉండడంతో, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వేలాది మంది టికెట్లు లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.