-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కాన్ విలియమ్సన్ అంటూ, అతని ఆట చూసి తానెంతో నేర్చుకున్నానని చెప్పాడు. విరాట్ గొప్ప క్రికెటర్. మూడు ఫార్మాట్లలోను బౌలింగ్ దాడులను ఎదుర్కోగల అతని సత్తా ప్రత్యేకమైంది. నేను అతడ్ని ఆరాధిస్తాననే మాట నిజం.
రియో డి జెనీరో, సెప్టెంబర్ 12: రియో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. మహిళల షాట్పుట్ ఎఫ్-53 విభాగంలో దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించి, భారత్ పతకాల సంఖ్యను మూడుకు చేర్చింది. పారాలింపిక్స్లో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. షాట్పుట్ను 4.61 మీటర్ల దూరానికి విసిరిన ఆమె రెండో స్థానంలో నిలవగా, బెహెరైన్కు చెందిన ఫాతిమ 4.76 మీటర్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది.
న్యూయార్క్, సెప్టెంబర్ 12: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్కు యుఎస్ ఓఫెన్ గ్రాండ్ శ్లామ్ ఫైనల్లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా 6-7, 6-4, 7-5, 6-3 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న వావ్రిన్కాకు కెరీర్లో ఇది మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్.
ముంబయి, సెప్టెంబర్ 12: పురుషులు, మహిళల విభాగాలతోపాటు జూనియర్స్ విభాగంలోనూ సెలక్టర్లు కావాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. అర్హతలను కూడా విస్పష్టంగా పేర్కొంది. ఈ మూడు విభాగాల్లోనూ ప్రస్తుత సెలక్షన్ కమిటీల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ ప్రకటన విడుదల చేసింది.
ముంబయి, సెప్టెంబర్ 12: న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాల్గొనే టీమిండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమతమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఫామ్ను కోల్పోయి, వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న వీరి ఎంపికపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈ పెద్దకాపులపై నమ్మకం ఉంచింది.
ముంబయి, సెప్టెంబర్ 12: జాతీయ సెలక్టర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో కఠిన నిర్ణయాలను తీసుకున్నానని, ఫలితంగా ఎంతో మంది స్నేహితుల్ని కోల్పోయానని సందీప్ పాటిల్ వాపోయాడు. 2012లో మహేందర్ అమర్నాథ్పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ కమిటీ (బిసిసిఐ) అతని స్థానంలో పాటిల్ను సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమించింది.
యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో
టాప్సీడ్స్ కరోలిన్ గార్సియా, క్రిస్టినా మ్లడెనొవిచ్ జోడీని 2-6, 7-6, 6-4 తేడాతో ఓడించి టైటిల్
సాధించిన బెథానీ మాటెక్ సాండ్స్, లూసీ సఫరోవా
గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 12: దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో ఇండియా రెడ్ 356 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్లూ మొదటి ఇన్నింగ్స్ను ఆరు వికెట్లకు 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 16 పరుగులు చేసింది. ఈ ఓవర్నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 356 పరుగులకు కుప్పకూలింది.
దిల్లీ: భారత మల్లయోధురాలు సాక్షి మలిక్ టాప్-5 రెజ్లర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకుల జాబితాలో 58 కిలోల విభాగంలో సాక్షి నాలుగో స్థానాన్ని సంపాదించింది. తొలిసారి రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షినే కావడం విశేషం.
ముంబయి: సందీప్ పాటిల్ నేతృత్వంలో సోమవారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లి(కెప్టెన్), రాహుల్, పూజారా, రహానె, విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, సాహా, రవీంద్ర జడేజా, షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్లతో 15మంది సభ్యులు గల జట్టును ప్రకటించారు.