-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
మాంట్రియల్, జూలై 22: ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రీడాకారులు డోపింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలతో తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న రష్యాను ప్రస్తుతం రియో ఒలింపిక్స్ నుంచి సంపూర్ణ నిషేధానికి గురయ్యే ప్రమాదం వెంటాడుతోంది.
ముంబయి, జూలై 22: స్టార్స్పోర్ట్స్ ప్రోకబడ్డీ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాట్నా పైరేట్స్ను 29-22 పాయింట్ల తేడాతో ఓడించి ఎనిమిదో వజయం సాధించింది. తొలి అర్ధ్భాగం ముగిసే సరికి 9-11 పాయింట్ల తేడాతో వెనకబడి ఉన్న పింక్ పాంథర్స్ రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే సూపర్ టాకిల్ ద్వారా స్కోరును 13 పాయింట్ల వద్ద సమం చేయగలిగింది.
న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి చర్చించేందుకు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆదేశించింది.
ముంబయి, జూలై 22: రియో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హాకీ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ ఆశాభావం వ్యక్తం చేశాడు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం సాధించని విషయం తెలిసిందే.
కోల్కతా, జూలై 22: ఒలింపిక్స్లో రెండో పతకం సాధించడంతో పాటు భారత్ తరఫున డేవిస్ కప్లో అత్యధిక సింగిల్స్ విజయాలు సాధించిన రామనాథన్ కృష్ణన్ రికార్డును బద్దలు కొట్టాలన్నది లియాండర్ పేస్ లక్ష్యమట. వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్స్లో ఆడడం ద్వారా ఏడవసారి ఒలింపిక్స్లో పాల్గొనే రికార్డు కోసం పేస్ ఇప్పుడు సంసిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘పేస్కు కొన్ని లక్ష్యాలున్నాయి.
బింగ్హామ్టన్ (అమెరికా), జూలై 22: అమెరికాలో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు రామనాథన్ రామ్కుమార్ (21) క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 214వ స్థానంలో కొనసాగుతున్న రామ్కుమార్ శుక్రవారం ఇక్కడి హార్డ్ కోర్టులో జరిగిన సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్కు చెందిన జోస్ స్ట్థామ్పై అద్భుత విజయాన్ని సాధించాడు.
హైదరాబాద్, జూలై 22: బ్రెజిల్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని, సహచర భారత అథ్లెట్లతో కలసి ఈ క్రీడల్లో చక్కటి ప్రదర్శనతో రాణించగలనని ఆశిస్తున్నానని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా స్పష్టం చేసింది. ‘ఒలింపిక్స్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నా. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి కెనడాకు బయలుదేరుతున్నా.
న్యూఢిల్లీ, జూలై 22: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ రియో ఒలింపిక్స్కు వెళ్లనున్నాడు. భారత ఒలింపిక్ సంఘానికి సుహృద్భావ రాయబారిగా నియమితుడైన సచిన్ను ఆగస్టు 5వ తేదీ నుంచి బ్రెజిల్లో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు విచ్చేయవలసిందిగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ ఆహ్వానించాడు. దీంతో సచిన్ వచ్చే నెల 2వ తేదీన రియో డీ జెనిరో నగరానికి బయల్దేరనున్నాడు.
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 21: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా గురువారం ఇక్కడి నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలో తడబడింది.
బెంగళూరు, జూలై 21: బ్రెజిల్లోని రియో డీ జెనిరోలో వచ్చే నెల జరుగనున్న ఒలింపిక్ క్రీడల్లో భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్గా బరిలోకి దిగనుండగా, తెలుగు తేజం పివి.సింధుకు 9వ సీడింగ్ను, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్ను కైవసం చేసుకున్న స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్కు టాప్ సీడింగ్ను ఇచ్చారు.