-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
అమరావతి, జనవరి 22: ఉద్యాన పంటల సాగును ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నామని, రానున్న కాలంలో ఆంధ్రను ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక స్థితిగతులను వ్యవసాయం మరింత పరిపుష్టం చేయాలన్నది తమ లక్ష్యమని, లాభసాటి సాగు ధ్యేయంగా పనిచేస్తున్నట్లు బాబు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి, ప్రాంతానికో ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు.
హైదరాబాద్/ కేపీహెచ్బీ కాలనీ, జనవరి 22: వివాహేతర సంబంధాలను అడ్డుకోవాల్సిన పోలీసులూ అదేదారిలో నడుస్తున్నారు. డిఎస్పీ స్థాయ మహిళా అధికారి, ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తికి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం బట్టబయలైంది. మహిళా అధికారి భర్తే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. సంఘటన పట్ల పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి/ బుచ్చినాయుడు కండ్రిగ, జనవరి 22: రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్లో నిర్ణయించిన ప్రకారం కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే రానున్న ఎన్నికల్లో ఏ ఇతర ఆలోచనలు లేకుండా బీజేపీతో కలసి నడవడానికి తాను సిద్ధమేనని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 68వ రోజైన సోమవారం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పాదయాత్ర సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్/ హైదరాబాద్, జనవరి 22: ఇకనుంచి సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టనని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం జనసేన సమన్వయకర్తల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
శేరిలింగంపల్లి, జనవరి 22: చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. తన తొమ్మిది నెలల పసిగుడ్డును ఎత్తుకుని తల్లి అపార్టుమెంటుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
భద్రాచలం టౌన్, జనవరి 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తరామదాసు 385వ జయంతి సందర్భంగా వాగ్గేయకారోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులు ఆలపించిన నవరత్న కీర్తనలు ఆద్యంతం అలరించాయి. ఆలయ ఈవో కె ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్ ఈ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
కొత్తగూడెం, జనవరి 21: మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు దళ సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అంబర్ కిషోర్ఝా తెలిపారు. ఆదివారం ఇక్కడి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి చత్తీస్గఢ్ రాష్ట్రానికి మావోయిస్టులకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోందనే పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ చేశారు.
తిరుపతి, జనవరి 21: ఈ నెల 24న సూర్య జయంతి సందర్భంగా తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహనాలపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.
హైదరాబాద్, జనవరి 21: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ డిజి వికె సింగ్ ఖైదీలను గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 26న చంచల్గూడ జైల్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఖైదీలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. చంచల్గూడ, చర్లపల్లి, వరంగల్ ఓపెన్ జైళ్లలో ఉన్న 63 మంది ఖైదీలను పరేడ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
తివిరి ఇసుకన తైలం తీయవచ్చు... ఇది నిజంగా నిజం. కరడుగట్టిన ఖైదీల్లో సైతం మార్పునూ తేవచ్చు. నైతికవర్తననూ పాదుకొల్పవచ్చు. జీవితం వ్యర్థం కారాదంటూ ‘ఉన్నత’ విలువలనూ పెంపొందించవచ్చు. ఒకసారి నేరం చేస్తే అది చర్విత చరణంగా జీవితానే్న మార్చేస్తుందన్న నైరాశ్యం నుంచీ బయటపడేవచ్చు. ఇలాంటి ఉన్నత భావాలను ఖైదీల్లో పాదుకొల్పి వారిలో పరివర్తనను తీసుకువచ్చే సమున్నత పథకమే ‘ఉన్నతి’.