S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/19/2019 - 05:35

గజ్వేల్: ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం పట్ల అప్రమత్తత అవసరం కాగా, ప్రభుత్వం చేపట్టిన హరితహారంను ఉద్యమంలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ. 7 కోట్ల లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు 717 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన సందర్బంగా ఆయన ప్రసంగించారు.

11/19/2019 - 01:18

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందు కు సాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు

11/19/2019 - 01:16

హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి అంతర్గత విచారణను చేపట్టాయి.

11/19/2019 - 01:13

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో గత 45 రోజులుగా జరుగుతున్న సమ్మెపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెపై హైకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేస్తూ కార్మిక శాఖ కోర్టులో తేల్చుకోవాలని ఇటు జేఏసీ, అటు ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో సమ్మెపై జేఏసీ నేతలు, విపక్షాల నేతలు తర్జనభర్జన చేశారు. సమ్మెపై ముందుకు పోవాలా?

11/18/2019 - 06:31

గణపురం, నవంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ మొదటి దశ వార్షిక మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 47 రోజుల క్రితం జెన్‌కో యాజమాన్యం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడంతో ప్లాంటును అధికారికంగా నిలిపివేశారు.

11/18/2019 - 06:34

సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. రైతును రాజు చేయాలని లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలు రుణ విముక్తి చేసిందన్నారు.

11/18/2019 - 06:27

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆదివారం మహాదీక్షను చేపట్టేందుకు ప్రయత్నించిన సబ్బండ వర్గాల నేతలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, పేదలు కలిసి ఇక్కడి ఇందిరాపార్క్ వద్ద ఆదివారం మహాధీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరామని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తదితరులు గుర్తు చేశారు.

,
11/18/2019 - 06:24

హైదరాబాద్: కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షలను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. తమ నేతల అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు బస్ డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న కార్మికులను చెదరకొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వైఖరి నెలకొంది. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

11/18/2019 - 06:19

హైదరాబాద్, నవంబర్ 17: హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలతో టీఎస్‌ఆర్‌టీసీ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, నిబంధనలను ఉల్లంఘించి ఆర్టీసీ సంస్థ టీఆర్‌ఎస్ నేతలకు డీలర్‌షిప్‌లను కేటాయించిన విషయమై విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ కేంద్రానికి లేఖ రాశారు. సర్వీసు ప్రొవైడర్ల ముసుగులో టీఆర్‌ఎస్ నేతలకు డీలర్లషిప్‌లను కేటాయిస్తున్నారనే అభియోగాలు వచ్చాయన్నారు.

11/18/2019 - 06:18

హైదరాబాద్: ప్రపంచ శాంతికి బుద్ధిజమే శరణ్యమని రాష్ట్ర విద్యుత్ మంత్రి జి. జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో రెండు రోజుల నుండి జరుగుతున్న ‘బౌద్ద సంగీతి-2019’ ముగింపు సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడారు. థాయిలాండ్, నేపాల్, భూటాన్ తదితర 17 దేశాల నుండి వచ్చిన బౌద్దప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ స్థాయి సదస్సు వైభవంగా జరిగింది.

Pages