-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
మహబూబ్నగర్, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో రోజురోజుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల్లో ఛరిష్మా తగ్గిపోయిందని నేనే రాజును, నేనే చక్రవర్తిని అనే విధానాన్ని ఆయన అవలంబిస్తున్నారని ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి ఆరోపించారు.
మహబూబాబాద్: ఆర్టీసీ సమ్మె మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోజుకు ఒక తీరుగా మారుతున్న పరిణామాలతో గుండె చెదిరి మరో డ్రైవర్ బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేష్ (50) తన చావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం అని ఒక సూసైడ్ నోట్ రాసి బుధవారం తెల్లవారుజామున తన ఇంటిలో పురుగుల మందు తాగాడు.
హైదరాబాద్, నవంబర్ 13: రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో చర్చలు, రాజీలు లేకుండా పాలన సాగిస్తోందని పీసీసీ నేత మల్లు రవి ధ్వజమెత్తారు.బుధవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వంపైన సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు రైతులు తీసుకువచ్చే పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సేద్యం మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట, నవంబర్ 13: సూర్యాపేట మత్స్యపారిశ్రామిక సంఘంలో సభ్యులకు హైకోర్టు ఆదేశాల మేరకు నైపుణ్య పరీక్షలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు బుధవారం జిల్లాకేంద్రంలోని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్,నవంబర్ 13: న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసనలు చేపడుతూ అందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. బుధవారం సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో అందోళనలు మిన్నంటగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ప్రముఖులను పోలిన వేషధారణలు ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి.
ముధోల్, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ దాదాపు 40 రోజుల అవుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు నెలలుగా కార్మికులకు జీతాలు లేక కుటుంబ పోషణ భారమవుతోంది. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్కు చెందిన భూమేష్ భైంసా డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచక వ్యవసాయ కూలీగా మారాడు.
*చిత్రం...సచివాలయం బీఆర్కే భవన్లో బుధవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు ఆర్పిస్తున్న మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, టీ హరీశ్రావు
హైదరాబాద్, నవంబర్ 13: మార్క్ఫెడ్ ద్వారా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని విద్యార్థి జనసమితి నేత బాబు మహాజన్ కోరారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా విద్యాశాఖలో ఆంధ్రా పెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తొందని, అలాగే ఆంధ్రా అధికారులను రాష్ట్రం నుండి వారి సొంత ప్రాంతాలకు పంపించాలని ఆయన కోరారు.