-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఆగస్టు 13: ‘రాబోయే రోజులే మనకు చాలా కీలకం, ఇక మీదట ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టపడి పని చేయాలి..’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర కుంతియా అన్నారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్లో టి.పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 13: సంస్కృత పద్యాలను సులువైన పదాలతో సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా వ్రాయగల సాహితీవేత్త మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి మూర్త్భీవించిన తెలుగు తేజమని పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. కవిత్వం పాండిత్యం సమపాళ్ళలో ఉన్న మేధావి అని ఆయన అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కోరింది. విద్యాసంస్థల్లో సౌకర్యాల విషయంలో విద్యార్థి, విద్యార్థినులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: మత మార్పిడి, ముస్లిం రిజర్వేషన్లు, డ్రగ్స్ మాఫియా తదితర అంశాలపై విహెచ్పి, బజరంగ్దళ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలో బిజెపిని పటిష్టపరిచేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇక 21 నెలలే ఉన్నందున ఇప్పటి నుంచే దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపై దృష్టి పెట్టాలని అమిత్ షా భావిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలోని నదుల్లో ప్రవహించే నీటిలో కనీసం 15 నుంచి 20 శాతం నీరు నిరంతరం ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని వల్ల పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.
హైదరాబాద్, ఆగస్టు 13: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రులు, గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా, మంత్రుల సంఖ్య మాత్రం 18. దీంతో స్పీకర్, చీఫ్విప్తో పాటు పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులకు సైతం జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యత అప్పగించారు.
హైదరాబాద్, ఆగస్టు 13: బాలబాలికల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడల వల్ల పెచ్చుమీరుతున్న అసహనం, హింస, నేరప్రవృత్తిని అరికట్టేందుకు, ప్రజాస్వామ్యం, చట్టాలంటే విధేయత పెంచేందుకు స్టూడెంట్ పోలీసు కేడెట్ (ఎస్పిసి) వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. క్రమశిక్షణ, సేవ భావాన్ని బాలల్లో పెంచే లక్ష్యంతో ఎస్పిసిని కేరళ రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేశారు.
వనపర్తి, ఆగస్టు 12: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హంతక ప్రభుత్వం కొనసాగుతోందని, అక్రమాలను ప్రశ్నించే వారిని అణచివేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన హిట్లర్ను సైతం తలదనే్నలా ఉందని టి-మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్లో శనివారం జరిగిన టి-మాస్ ఫోరం ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
కేతేపల్లి, ఆగస్టు 12: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో గల జిఎంఆర్ టోల్ప్ల్లాజా వద్ద శనివారం వాహనాల రద్దీతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వరుసగా నాలుగురోజుల పాటు సెలవులు రావడంతో హైదరాబాద్లో నివాసముంటున్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణమడంతో ఉదయం నుండి వాహనాల రద్దీ కొనసాగింది.