-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
న్యూఢిల్లీ, జనవరి 17: ఏపీ విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని 89 ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, పంపకాలపై మంగళవారం కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయి. సంస్థలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని రెండు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.
హైదరాబాద్, జనవరి 17: రాజధానిలో మెట్రోప్రాజెక్టు పనులు 75శాతం పూర్తయ్యాయని, జూన్లో మెట్రో పరుగులు పెడుతుందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మొదటి దశ అనుకున్న సమయానికే పూర్తవుతుందన్నారు. 2018 చివరి నాటికి రెండవ దశ పూర్తవుతుందని చెప్పారు. అయితే పాత నగరంలో మెట్రో ఏ మార్గంలో వెళుతుందో ఇప్పటికీ ఖరారు కాలేదన్నారు.
సిద్దిపేట, జనవరి 16: తరగతి గదిలో అందరి ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన ఎర్రోళ్ల భవాని ఆత్మహత్య చేసుకుందని ఏసిపి నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
మల్దకల్, జనవరి 16: భూమి అక్రమ ఖాతా మార్పు కేసులో రెవెన్యూ అధికారులను అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంఘటన సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన రైతు రత్నమ్మ పేర పాలవాయి గ్రామ శివారు సర్వేనెం.113, 114, 115లలో 30.18 ఎకరాలు ఉంది.
నల్లగొండ లీగల్, జనవరి 16 : హెడ్కానిస్టేబుల్ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్కు జీవితఖైధు విదిస్తూ నల్లగొండ జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా వున్నాయి.
హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఈ నెల 17న జరగాల్సిన ఎన్నికలను నిలిపివేయడానికి రాష్ట్ర హైకోర్టు సోమవారం నిరాకరించింది. వెంకట ప్రతాప్, నరేశ్ శర్మ దాఖలు చేసిన రెండు పిటిషన్లను స్వీకరించిన జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, జనవరి 16: సైనికులుగా పని చేసి రిటైర్ అయిన తరువాత డబుల్ పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనికులుగా పని చేసి రిటైర్ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి రిటైర్ అయిన తరువాత వారికి ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది.
కామారెడ్డి టౌన్, జనవరి 16: కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ప్రజావాణి ఫిర్యాదుల కార్యాలయం ముందు వివాహిత మహిళ సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకెటి అనిత ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చి నిరుత్సాహంతో తమకు న్యాయం జరగడం లేదంటూ విలేఖరులతో వాపోయింది.
నల్లగొండ, జనవరి 16: సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై టోల్ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
హైదరాబాద్, జనవరి 16: రైతులు, గ్రామీణ యువత అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ్భారతి ట్రస్ట్ పని చేస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. శంషాబాద్లోని ముచ్చింతల్లో స్వర్ణ్భారతి హైదరాబాద్ చాప్టర్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించారు.