-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ముస్లిం-మైనారిటీల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిస్తూ రాష్ట్రంలోని ముస్లిం పాఠశాలలకు కేంద్రం 75 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 18: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వెల్లివిరుస్తోందని, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చి మరింత దోహదం చేస్తే అవినీతిని, పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పేర్కొన్నారు. నగదురహిత లావాదేవీలు పెద్ద ఎత్తున చేపట్టే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించే ఆలోచన కేంద్రానికి ఉందని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 18: భూసేకరణకు సంబంధించి 2013 చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలు చెల్లవంటూ ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూల్స్ను రూపొందించింది. ‘తెలంగాణ స్టేట్ రైట్ టు ఫెయిర్ కంపెనే్సషన్ రూల్స్, 2014’గా దీన్ని పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తర్వులు (జీఓఎంఎస్ 6) జారీ అయ్యాయి.
హైదరాబాద్, జనవరి 18: ఆర్థిక నేరాలపై దృష్టి సారించామని, వీటి నియంత్రణకు ఆర్బీఐ, సెబితో కలసి పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కె అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నేరాలు, ఖాతాల రక్షణ, సైబర్ క్రైమ్వంటి అంశాలపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో దాదాపు 80మంది పోలీస్, సిఐడి అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 18: వచ్చే వార్షిక బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. వచ్చే బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు పంపించిందన్నారు.
హైదరాబాద్, జనవరి 17: పది, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అఫిటవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఏలూరుకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.
హైదరాబాద్, జనవరి 17: జపాన్, దక్షిణ కొరియా దేశాలలో వారం రోజుల పర్యటన నిమిత్తం ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ రంగాలలో పలు కంపెనీలతో మంత్రి తన బృందంతో కలిసి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరనున్నారు.
అమరావతి, జనవరి 17: అర్చకులు, పురోహితులను పెళ్లిచేసుకునేందుకు ఎవరూ ముందుకురాని నేపథ్యంలో బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న బ్రాహ్మణ యువకుల వైవాహిక జీవితానికి చేయూతనిచ్చేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ వినూత్న ఆలోచనకు తెరలేపింది. వారిని పెళ్లిచేసుకునే బ్రాహ్మణ ఆడపిల్లలకు లక్షరూపాయల నజరానా ప్రకటించింది.
వనపర్తి/పాన్గల్, జనవరి 17: వనపర్తి జిల్లా పాన్గల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోగల బొల్లిగట్టుచెరువు మలుపువద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలైనట్లు పాన్గల్ ఎఎస్సై చంద్రారెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జనవరి 17: కొత్త జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల్లో సమీకృత భవన సముదాయాలను నిర్మించనున్నట్టు చెప్పారు.