-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు వెంటనే తెరదించాలని జనవాహని పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఇరు వర్గాల తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై హర్షం ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 : స్టోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం కల్పించిన రెండు శాతం ఉద్యోగాల రిజర్వేషన్ అర్హులకు మాత్రమే ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర టూరిజం, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. క్రీడాప్రాధికార సంస్థపై ఎల్బీ స్టేడియంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు ఉపాధ్యాయు సంఘాల జేఏసీ సంఘీభావంగా నిలుస్తుందని ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. బుధవారం ఎస్టీయు భవన్లో జరిన సమావేశంలో జెఎసీటీవో, యుఎస్పీసీ రాష్ట్ర కమిటీలు ఉమ్మడి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమ్మెకు సంఘీభావంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. సమ్మెకు మద్దతుగా ఆయా సంఘాలు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: సమ్మె ప్రభావంతో ప్రజారవాణాకు ఇబ్బందులు లేకుండా వందశాతం ఆర్టీసీ బస్లు తిప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డిపోల మేనేజర్లకు సూచించారు. గత 11 రోజులుగా సమ్మె జరుగుతుంటే రవాణా కోసం బస్లను ఎందకు పూర్తిస్థాయిలో తిప్పడంలేదని డీఎంలను మంత్రి నిలదీశారు. బుధవారం తెలంగాణలోని అన్ని డిపోల మేనేజర్లతో వీడియో కార్ఫరెన్సలో మంత్రి మాట్లాడారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేయడాన్ని విద్యుత్ కార్మికులు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం మింట్ కాంపౌండ్లో జరిగిన ధర్నాకు వేలాదిమంది విద్యుత్ ఆర్టిజన్లు హాజరు అయ్యారు. తమ డిమాండ్ల తక్షణం ఆమోదించాలని నినాదాలు చేశారు.
హైదరాబాద్: ప్రగతిభవన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతూ టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేశారు. రెండేళ్ల నుంచి పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగాలు ఇవ్వటం లేదంటూ అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్: సోమవారంలోగా జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలంగాణ యాజమాన్యాన్ని ఆదేశించింది. సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీలోని 49,190 మందికి తక్షణమే జీతాలు చెల్లించాలని ఆదేశించింది. సిబ్బంది సమ్మె వల్ల జీతాల చెల్లింపులో ఆలస్యం అయిందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. సోమవారంలోగా చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది.
హుజూర్నగర్, అక్టోబర్ 15: గత ఆరేళ్లలో రాష్ట్రంలో, హుజూర్నగర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అప్పులు చేసిన వారు ఇప్పుడు అభివృద్ధి చేస్తారా? అని కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఉదయం హుజూర్నగర్ నుంచి కోదాడ వెళ్లే రోడ్డులో శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం దద్దనాల చెర్వు కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
యాదగిరిగుట్ట, అక్టోబర్ 15: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి 26 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామివారి హుండీ ఆదాయం 63లక్షల 45వేల 754 రూపాయలు, బంగారం 47 గ్రాములు, వెండి రెండు కిలోల ఏడు వందల గ్రాములుగా వచ్చినట్లుగా ఈవో గీతా తెలిపారు.
నాగార్జునసాగర్, అక్టోబర్ 15: నాగార్జునసాగర్ ప్రాజెక్టును మంగళవారం నాడు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ టీమ్ సందర్శించి పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్సీ కేఎస్ఎన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ బృందం ప్రాజెక్టులోని పలు సున్నితమైన విభాగాలను సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా సాగర్ డ్యాం క్రస్టు గేట్లను స్పిల్వేను, గ్యాలరీలను, సీపేజ్లను పరిశీలించి నమోదు చేసుకున్నారు.