S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/14/2020 - 00:29

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభు త్వం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా ఆరోపించారు. 72 ఏళ్లుగా రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నా రు.

02/13/2020 - 07:37

దేవరకొండ, ఫిబ్రవరి 12: సీలింగ్ భూములను ఇతరుల పేరుపై మార్చడం అనేది చట్టవిరుద్ధం. సీలింగ్ భూములపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉంటుంది.

02/13/2020 - 07:37

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 12: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని రామాపురం గ్రామసర్పంచ్‌కు సోమవారం రాత్రి రాష్ట్ర మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. ఈవిషయమై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు.

02/13/2020 - 01:13

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణలో తమ పరిశ్రమలను స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి మరికొన్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు మరిం త ఊతం ఇచ్చేలా పని చేస్తున్నామన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

02/13/2020 - 01:11

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గోదావరి నదిపై నిర్మాణం అవుతున్న తుపాకులగూడెం బ్యారేజీకి ఆదివాసీ వీర వనిత, వనదేవత ‘సమ్మక్క’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు.

02/12/2020 - 06:44

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆమ్ ఆద్మీ పార్టీని ఏకపక్షంగా గెలిపించి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీ విభజన రాజకీయాలకు చెంపపెట్టు అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆప్ విజయంపై వామపక్ష నేతలు వేర్వేరు ప్రకటనల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.

02/12/2020 - 06:41

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి అనుమతులు రద్దు చేయాలని ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఫార్మా పరిశ్రమల వల్ల పర్యావరణం, నీరు, భూమి, వాతావరణం కాలుష్యమవుతాయన్నారు. ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి వ్యవసాయానికి యోగ్యంగా ఉండే మంచి భూములని చెప్పారు.

02/12/2020 - 06:40

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడు జయేష్ రంజన్ తెలిపారు. టీఓఏ అధ్యక్షునిగా ఎన్నికైన జయేష్ రంజన్‌ను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు ఘనంగా సత్కరించారు.

02/12/2020 - 06:39

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో మహిళలు, యువతుల భద్రత, రక్షణ కోసం చేపట్టిన చర్యలు వినూత్నంగా ఉన్నాయని.. దీంతో మహిళల్లో భరోసా ఏర్పడిందని ప్రశంసించారు. తాజాగా మహిళల భద్రత కోసం సేఫ్టీ క్లబ్‌లను తీసుకురావడం సంతోషకరమన్నారు. సికింద్రాబాద్ ఎస్‌వీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రు ఫ్లెమింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

02/12/2020 - 06:37

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు , బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దీయాళ్ ఉపాధ్యాయ ఆదర్శాలే దేశానికి మార్గమని మాజీ గవర్నర్, బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీన్ దయాళ్ వర్థంతి కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.

Pages