-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్పోల్స్, ఒపీనియన్ పోల్స్, సర్వేలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఈ నిషేదాజ్ఞలు ఈ నెల 12 ఉదయం 7 గంటల నుండి 2019 డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 10: భారత ప్రభుత్వ తొలి విద్యామంత్రి డాక్టర్ వౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించుకోవాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ సూచించింది. అయితే ఈసారి రెండో శనివారం రావడంతో చాలా వరకూ విద్యాసంస్థలు మూత పడ్డాయి. ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు మాత్రం జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 10: పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోడంతో రాష్ట్రంలో రైతులు రోడ్లెక్కుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి నేరుగా సొసైటీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిజామాబాద్: గల్ఫ్ కార్మికుల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆమె మీడింయాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి కార్మకులను పరామర్శించటం విడ్డూరంగా ఉందని అన్నారు. 1278 కార్మికలను స్వదేశానికి తీసుకువచ్చామని చెప్పారు.
హైదరాబాద్: శంషాబాద్లోని దివ్యసాకేతాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జియర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
రాజన్న సిరిసల్ల: ఎన్నికల తరువాత దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ పెంచుతామని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. ఆయన సిరిసిల్లలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. దివ్యాంగులకు ఇపుడు ఇస్తున్న పెన్షన్ 1500 నుంచి రూ.3016కు పెంచుతామని, అలాగే వారికి 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 9: ముందస్తు ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కే. జానారెడ్డి భరోసా ఇచ్చారు. అధిష్ఠానం అంగీకరిస్తే తన కుమారుడే పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 9: రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులపై టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నలుగురు నేతలకు ఎన్నికల కమిషన్ శుక్రవారం తాఖీదులు జారీ చేసింది. వీరిలో మంత్రి హరీశ్రావు, కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి, వంటేరు ప్రతాప్రెడ్డి, టీడీపీ నాయకుడు రేవూరి ప్రకాశ్రెడ్డి ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 9: హైదరాబాద్ నగరానికి మరో ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం తరలిరాబోతుంది. టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ సంస్థ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇండియాలో ఇంటెల్ విస్తరణకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నట్టు ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ వెల్లడించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో నివృతి రాయ్ సమావేశమయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 9: చిన్న పిల్లల్లో దృష్టి లోపం (మయోపియా) పెరుగుతుండడం పట్ల కంటి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో పిల్లల కంటి సంరక్షణ వారోత్సవాన్ని నిర్వహించారు. వైద్య నిపుణలు మాట్లాడుతూ పిల్లలు గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు చూస్తుండడం వల్ల దృష్టిలోపం ఏర్పడుతోందని అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి ముదురుతుందని హెచ్చరించారు.