S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 03:05

ఆదోని, నవంబర్ 20 : ప్రభుత్వాలు గతంలో, ప్రస్తుతం నోట్లు రద్దు చేసిన సందర్భాల్లో ఎక్కువగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ నల్లధనం పూర్తిస్థాయిలో బయటకు రాలేదనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని చరిత్ర కూడా స్పష్టం చేస్తుంది. మన దేశంలో నోట్ల రద్దు అనే విషయం కొత్తేమీ కాదు. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు, ఇప్పుడు నల్లకుబేరుల కంటే ప్రజలే ఎక్కువగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

11/21/2016 - 02:57

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 20: హైదరాబాదు నుండి తెనాలికి అక్రమంగా తరలిస్తున్న సుమారు పది లక్షల విలువైన వెండి, నగదును సర్కిల్ పోలీసులు అదివారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. దీనికి సంబంధించి చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఐ లచ్చునాయుడు వివరాలు తెలిపారు.

11/21/2016 - 02:51

ఫజూ (చైనా), నవంబర్ 20: భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆమె ఒక సూపర్ సిరీస్‌లో విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి సన్ యూను 21-11, 17-21, 21-11 తేడాతో ఓడించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత ఈ హైదరాబాదీ ఒక టైటిల్‌ను అందుకోవడం ఇదే ప్రథమం.

11/21/2016 - 02:47

అనంతపురం, నవంబర్ 20 : అనంతపురం నగరంలో ఆదివారం అధికారులు రోడ్ల విస్తరణకు పూనుకోగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కోన శశిధర్ సూచనలతో నగరపాలక సిబ్బంది పోలీసుల సహాయంతో నగరంలోని తిలక్‌రోడ్డులో ఆక్రమిత స్థలాల్లోని భవనాలను కూలదోసేందుకు యత్నించారు. దీంతో స్థానికులు జెసిబిని అడ్డుకుని ఆందోళనకు దిగారు.

11/21/2016 - 02:45

రాజవొమ్మంగి, నవంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతూ రూ.2వేల నోటుకు చిల్లర దొరకక సమయానికి వైద్యశాలకు వెళ్లకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన నెల్లూరి కృష్ణ (46) ఆస్మా రోగంతో బాధపపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు చిల్లర దొరకక ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.

11/21/2016 - 02:44

విజయవాడ, నవంబర్ 20: చౌక ధరల దుకాణాలకు వెళ్లి, సరకులను తీసుకువెళ్లలేని వారి కోసం అమలు చేస్తున్న మీ ఇంటికి మీ రేషన్ పథకం ఆశించిన ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్రంలో 57 వేల మంది ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించింది. సరకుల ప పంపిణీలో జరుగున్న అక్రమాలకు తెరదించేందుకు ఇ-పోస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

11/21/2016 - 02:43

రామభద్రపురం, నవంబర్ 20: విజయనగరం జిల్లా, రామభద్రపురం మండల కేంద్రంలోగల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఎస్‌ఐ డిడి నాయుడు అందించిన వివరాలివి. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది.

11/21/2016 - 02:42

తిరుపతి, నవంబర్ 20: తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఆదివారం కార్తీక వనభోజనం ఘనంగా జరిగింది. సర్వాలంకరణ భూషితుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై కొలువుదీరి ముందుభాగాన కదులుతుంటే, వెనుక పల్లకిపై శ్రీదేవి, భూదేవిలు మందగమనంతో స్వామిని అనుసరించారు. వాహన మండపం నుంచి బయలుదేరిన స్వామిని భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పార్వేటి మండపం వద్దకు తీసుకువచ్చారు.

11/21/2016 - 02:42

గుంటూరు, నవంబర్ 20: రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మరోసారి స్విస్ ఛాలెంజితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టులో ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రా సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన అనంతరం ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.

11/21/2016 - 02:41

పినపాక, నవంబర్ 20: అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుగినేపల్లి పంచాయతీ చేగరిసెల గ్రామంలో జరిగింది.

Pages