S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 03:29

ధర్మపురి, నవంబర్ 20: కార్తీక మాస ఆదివారం పవిత్ర దినాన రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి హరిద్వార్, అమరావతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కైలాసానంద స్వామి, శ్రీశ్రీశ్రీ శివస్వామిల సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో, మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

11/21/2016 - 03:27

నల్లగొండ, నవంబర్ 20: సహకార బ్యాంకుల ద్వారా పాతనోట్ల మార్పిడి ప్రక్రియను ఆర్‌బిఐ అనుమతించకపోవడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని లక్ష 95 వేల మంది ఖాతాదారులు, 87 వేల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా 1000 కోట్ల వార్షిక లావాదేవిలు సాగిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి నేడు ఖాతాదారులకు, సిబ్బందికి వేయి రూపాయలైనా ఇవ్వలేని దుస్థితిలో పడింది.

11/21/2016 - 03:25

ధర్మపురి, నవంబర్ 20: భారతదేశ ప్రాచీన నాగరికత, సభ్యతా సంస్కృతులకు మూలాధారాలైన, ప్రాతఃస్మరణీయాలైన నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హరిద్వార్ పీఠాధిపతి మహా మండలేశ్వర కైలాసానంద బ్రహ్మచారి స్వామీజీ ఉద్భోదించారు.

11/21/2016 - 03:19

హైదరాబాద్, నవంబర్ 20: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమ పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేస్తారని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి పోయిన దేశ ప్రజలు 1977 సంవత్సరంలో జనతా పార్టీకి నోటు ఇచ్చి ఓటు వేశారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నదని ఆయన చెప్పారు.

11/21/2016 - 03:15

నాగిరెడ్డిపేట్, నవంబర్ 20: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పిడియాక్టు అమలు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెదలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు. విత్తన క్షేత్రంలో స్థానిక నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

11/21/2016 - 03:12

హైదరాబాద్, నవంబర్ 20: జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. దత్తాత్రేయ కుమార్తె వివాహం ఈ నెల 24న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు దత్తాత్రేయ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళి అక్కడ కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌ను కలిసారు.

11/21/2016 - 03:11

సిద్దిపేట, నవంబర్ 20: కళలకు కాణాచి సిద్దిపేట అని.. కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో అత్యుత్తమ కళాకారులుగా ఎదుగుతారన్నారు. కాపురాజయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాపు చిత్రలేఖ చిత్రకళలో తన తాతయ్యను మించిపోవాలని మంత్రి ఆకాంక్షించారు.

11/21/2016 - 03:10

హైదరాబాద్, నవంబర్ 20: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం ప్రజలను బెదిరించి, బలవంతంగా బినామి పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, ఇళ్ళ స్థలాలను తిరిగి బాధితులకు అప్పగించే అవకాశం ఉంది. నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తరువాత అతని ఆస్తులకు సంబంధించి నగదు, రికార్డులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీన పరచుకున్న సంగతి తెలిసిందే.

11/21/2016 - 03:10

న్యూఢిల్లీ, నవంబరు 20: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్రాలలో సమస్యలు ఉత్పన్నమయ్యయని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి వివరించారు. జీఎస్టీ పన్ను కేటాయింపులపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఆదివారం నాడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.

11/21/2016 - 03:08

పుట్టపర్తి, నవంబర్ 20 : ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యసేవలు అమోఘమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా కొనియాడారు. అనంతపురం జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

Pages