S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్బవరం, నవంబర్ 20: విశాఖపట్నం జిల్లాలో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను దొంగలు అపహరించుకుపోయారు. సబ్బవరం మండలం, దేవీపురం సమీపంలోని భీశెట్టినగర్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్ఐ తోట మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి.
విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 20: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ప్రత్యర్థి ముందు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆతర్వాత నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఆటలో ఇంగ్లాండ్ ఇంకా 318 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.
చిత్రం.. భివానీ (హర్యానా)లోని బలాలీ గ్రామంలో ఆదివారం రెజ్లర్ పవన్ కుమార్తో
మహిళా రెజ్లర్ గీతా ఫొగట్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
క్రైస్ట్చర్చి, నవంబర్ 20: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్హోమ్ మొదటి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో ఒకటి చొప్పున మొత్తం ఏడు వికెట్లు సాధించగా, బ్యాట్స్మన్ జీత్ రావల్ మొదటి ఇన్నింగ్స్లో 55, రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 36 చొప్పున పరుగులు చేసి, అద్భుత ప్రతిభ కనబరచడంతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన న్యూజిలాండ్ మొదటి టెస్టులో పాకిస్తాన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.
చిత్రం.. ఢిల్లీ హాఫ్ మారథాన్ విజేత ఎల్యుడ్ కిప్చోగేతో జమైకా స్ప్రింర్ అసాఫా పావెల్,
కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 20: భారత్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల మహిళల టి-20 సిరీస్ను, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్లో ఓడిన హర్మన్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ ఆదివారం నాటి రెండో టి-20లోనూ విఫలమై, 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీనితో సిరీస్ను విండీస్ సొంతం చేసుకోగా, మంగళవారం జరిగే చివరి, మూడో మ్యాచ్కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది.
విశాఖపట్నం: ఇది పరిమిత ఓవర్ల క్రికెట్ కాదు కాబట్టి పరుగుల వేటలో వికెట్లు పారేసుకోవలసిన అవసరం లేదని, ఇంకా 8 వికెట్లు తమ గుప్పిట్లో ఉన్నాయని, నిలకడగా ఆడి స్కోరు సాధిస్తామని ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. గెలుపు కోసం భారత జట్టు తొందరపడుతుంది కాబట్టి ఒత్తిడి పూర్తిగా వారిపైనే ఉంటుందని అన్నాడు.
హైదరాబాద్, నవంబర్ 20: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) అంగీకరించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్టు గౌరవ కార్యదర్శి జాన్ మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దు మరింత సమర్థంగా అమలు కావటంతోపాటు సగటు మనిషి ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిసింది.
హైదరాబాద్, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కుడికాల్వ గట్టుపై ఐదు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ను సోమవారం ప్రారంభిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామం వద్ద ఈ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ ద్వారా సాలీనా 8.06 ఎంయు విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.37.58 కోట్లు ఖర్చయింది.