S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:23

విజయనగరం, జూలై 31: పాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లాలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రెవెన్యూ డివిజన్ పరిధి, పోలీసు డివిజన్ పరిధి ఒకేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో ఏర్పడే కొత్త రెవెన్యూ డివిజన్ ఎక్కడనేది అధికార పార్టీ నాయకులకు అంతుపట్టని విధంగా మారింది.

08/01/2016 - 00:23

గజపతినగరం, జూలై 31: మలేరియా మహమ్మారికి భార్యాభర్తలు బలైన సంఘటన మండలంలోని గంగచోళ్లపెంటలో చోటుచేసుకుంది. కలకాలం కలసి ఉంటామని పెళ్లిలో బాసలు చేసి కొన్నాళ్లు కాపురం చేసి చివరికి మృత్యువులో కూడా ఇద్దరు అరగంట వ్యవధిలోనే బలయ్యారు. వీరిని నమ్ముకున్న నలుగురు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు.

08/01/2016 - 00:22

విజయనగరం, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో దోబూచులాట ఆడేది కాదని, ప్రత్యేకహోదా విషయంలో మొండిచేయి చూపేది కాదని మాజీ ఎమ్మెల్యే, వైకాపా జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

08/01/2016 - 00:21

జియ్యమ్మవలస, జూలై 31: మండలంలో 600 ఎకరాల్లో పండ్లు, జీడితోట ల పెంపకాన్ని చేపడుతున్నట్లు ఎపిఓ. ఎస్సీ కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా 450 కిలోల జీడిపిక్కలు బా పట్ల జీడి పరిశోధన కేంద్రం నుంచి జి. సి.సి. తెప్పించినట్లు తెలిపారు. ఈ రకం జీడితోటలవలన ఒకేగుత్తులో 60 నుం చి 70 వరకు జీడిపిక్కలు కాస్తాయని తెలిపారు. 10వేల స్టంపులు కొనుగోలు చేసి తెప్పించామన్నారు.

08/01/2016 - 00:21

విజయనగరం(టౌన్), జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం అఖిలపక్షంతో కలసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వామపక్ష నాయకులు సూచించాయి.

08/01/2016 - 00:20

విజయనగరం, జూలై 31: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్‌యాదవ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ పేరిట కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

08/01/2016 - 00:18

గజపతినగరం, జూలై 31: ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని సిపి ఎం డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 2వ తేదీన రాష్ట్ర బం ద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని అన్నారు.

08/01/2016 - 00:17

విజయనగరం, జూలై 31: విజయనగరం పట్టణంలోని గాజులరేగ ప్రాంతంలో యువతి హత్యాయత్నం కేసులో సకాలంలో స్పందించిన టూటౌన్ ఎస్సై రవికి ఎస్పీ కాళిదాసు ఆదివారం నగదు రివార్డు అందజేశారు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో గౌతమి అనే యువతిని కుసుమంచి విక్రమ్ అనే యువకుడు గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించిన సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది.

08/01/2016 - 00:17

విజయనగరం, జూలై 31: ఉద్యోగాల నియామక విషయంలో నిరుద్యోగులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కాళిదాసు సూచించారు. ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పోలీసు శాఖలతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన సందర్భంలో ఆయా శాఖల, కంపెనీల ఉన్నతాధికారులు తమకు సన్నిహితులంటూ నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారని తెలిపారు.

08/01/2016 - 00:16

విజయనగరం(టౌన్),జూలై 31: హుదూద్ తుఫానులో తీవ్రంగా జిల్లాలో పచ్చదనం దెబ్బతింది. పర్యవసానంగా పర్యావరణ సమతుల్యం లోపించి ఎన్నడూ లేనివిధంగా పట్టణ , గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎండలతో అల్లాడిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కాస్తో కూస్తో పచ్చదనం, చెట్లు చేమలు కనిపిస్తాయి. కాంక్రీట్ జంగిల్ లాంటి పట్టణాల్లో పచ్చదనం మచ్చుకైనా కానరావడంలేదు.

Pages