S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, జూలై 29: మేషరాశిలో ప్రవేశిస్తే గంగా పుష్కరాలు, వృషభ రాశిలో ప్రవేశిస్తే రేవా నది పుష్కరాలు, మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతీ నది పుష్కరాలు, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే యమునా నది పుష్కరాలు, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు, కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణానది పుష్కరాలు, తులారాశిలో ప్రవేశిస్తే కావేరి నది పుష్కరాలు, వృశ్చికరాశిలో ప్రవేశిస్తే భీమరథీ నది పుష్కరాలు, ధనస్సు రాశిలో ప్రవేశిస
విజయవాడ, జూలై 29: ప్రభుత్వం ప్రారంభించిన గ్రీనాంధ్రప్రదేశ్తో నగరం పచ్చదనంగా మారుతుండగా మరోపక్క రోడ్డు పక్కన వున్న చెట్లకు అందంగా లైటింగ్స్ వేయటంతో అవి దగదగా మెరిసిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన వనం-మనంతో ఖాళీ ప్రదేశాల్లో గ్రీనిష్ ఏర్పడుతుండగా, నగరంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వల్ల నగరానికి పండుగ కళ వచ్చింది. నగరంలో చెట్లు నాటటం వల్ల పర్యావరణ పరంగా సమతుల్యత ఏర్పడుతుంది.
పాతబస్తీ, జూలై 29: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ చొరవతో పంజా సెంటర్లోని రైల్వే క్వార్టర్స్ వద్ద రోడ్డు విస్తరణ జరిగింది. పంజా సెంటరు నుండి రైల్వే వెస్టు బుకింగ్ కార్యాలయం వైపు ఉన్న రైల్వే క్వార్టర్స్ గోడ వల్ల విస్తరణకు అంతరాయం కలుగుతుందని ఆ గోడను తొలగించాలని జలీల్ఖాన్ సిఎంకి వివరించగా స్పందించిన ఆయన రైల్వే అధికారులతో సంప్రదించగా రైల్వే అధికారులు గోడ పడేయడానికి అనుమతి ఇచ్చారు.
విజయవాడ, జూలై 29: బ్యాంకుల ప్రైవేటీకరణను, ఎస్బిఐలో అసోసియేట్ బ్యాంక్స్ విలీనాన్ని, నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బకాయిలు వసూలు చేయాలని, ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగవేసిన వారి పేర్లు ప్రకటించాలని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డిఐని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజ
పాతబస్తీ, జూలై 29: పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురికి ఎమ్మెల్యే జలీల్ఖాన్ చొరవతో ఆర్ధిక సాయం అందింది. శుక్రవారం ఉదయం లబ్దిదారులకు ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులు అందించారు. నలుగురు రోగులకు 2.5 లక్షల 75వేల చెక్కులు అందించగా బాధిత కుటుంబ సభ్యులు జలీల్ఖాన్కి కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ, జూలై 29: తెలుగుదేశం పార్టీ కాపులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ప్రస్తుతం ఉన్న బిసిలకు నష్టం లేకుండా కాపులకు అదనపు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగం ఛైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు.
విజయవాడ (రైల్వేస్టేషన్), జూలై 29: సామర్థ్యం కోల్పోయిన రైలు బోగీలు, గూడ్స్వాగిన్లకు తిరిగి సామర్థ్యం కల్పించే విధంగా మరమ్మతులు చేసే రోలింగ్ స్కాన్ కాంపొనెంట్ రిహాబిలిటేషన్ వర్క్షాపును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయటానికి రూ.280 కోట్ల నిధులను రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు విడుదల చేశారని దక్షిణ మధ్య రైల్వే జోనల్ సిపిఆర్ఓ ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ, జూలై 29: బాబు వస్తే జాబు అని ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోతుంటే విద్యార్థి లోకంపై తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్తేజ అన్నాడు. దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలను చదువుకు దూరం చేసే ప్రయత్నంలో భాగంగా సంక్షేమ హాస్టళ్లను మూసివేస్తూ విద్యార్థులను డ్రాప్ అవుట్స్గా మారుస్తున్నారన్నారు.
విజయవాడ, జూలై 29: నీటిపారుదలశాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రామకృష్ణ (53) శుక్రవారం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. వీరు ఆ శాఖలో ఎఇ నుంచి వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. రామకృష్ణ మృతి పట్ల ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు బత్తిన చిరంజీవి ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం(టౌన్), జూలై 29: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా సనపల తిరుపతిరావు శుక్రవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత వారం రోజులుగా ఇంచార్జి డిఎంహెచ్వోతో నెట్టుకొస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య రెగ్యులర్ డిఎంహెచ్వోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.