S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 04:44

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రిడ్ల వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. రాష్ట్రంలో అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద ఉంది. ఈ వనరులన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా వినియోగించుకుంటే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు.

07/28/2016 - 04:38

నర్సింగ్ యాదవ్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోగా, చివరి ఆశగా జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ విచారణ మిగిలింది. తాను నిర్దోషినని, తనకు సరఫరా చేసిన ఆహారంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా మాదక ద్రవ్యాలను కలిపి ఉంటారని నర్సింగ్ వాదిస్తున్న విషయం తెలిసిందే. నాడా క్రమశిక్షణ కమిటీ బుధవారం సమాశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది.

07/28/2016 - 04:36

న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ పంచయ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణాను ఎంపిక చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్ల్యుడబ్ల్యు) సానుకూలంగా స్పందించింది. అతని ఎంపిక పట్ల ఎలాంటి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుడబ్ల్యుడబ్ల్యు ఆమోద ముద్ర పడడంతో రియో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ పాల్గొనడం దాదాపుగా ఖాయమైంది.

07/28/2016 - 04:35

లాసనే్న, జూలై 27: రష్యా అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించడాన్ని మానుకోవడం లేదు. దీనితో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే బృందం నుంచి భారీ సంఖ్యలో అథ్లెట్లు నిషేధానికి గురవుతున్నారు. తాజాగా 19 మంది రోయర్లు డోప్ పరీక్షలో విఫలమైనట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించింది. డోప్ దోషుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, రియోకు వెళ్లే వారి సంఖ్య పలచబడుతున్నది.

07/28/2016 - 04:35

న్యూఢిల్లీ, జూలై 27: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ. ఆగ స్టు ఐదో తేదీన ముంబయలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) జరుగుతుందని తొలుత ప్రకటించారు. అయతే, సమావే శానికి నిర్దేశించిన అంశాల్లో ఎక్కడా లోధా కమిటీ సిఫార్సులు, వాటి అమలుకు సంబంధించిన ప్రస్తావనే లేదు.

07/28/2016 - 04:33

కింగ్‌స్టన్, జూలై 27: వెస్టిండీస్ టూర్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు బుధవారం వీడియో గేమ్స్‌లో బిజీబిజీగా గడిపింది. కింగ్‌స్టన్ చేరుకున్న భారత క్రికెటర్లు ఆటవిడుపుగా వీడియో గేమ్స్ ఆడుతూ టైమ్‌పాస్ చేశారు. విండీస్‌ను మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా అదే ఉత్సాహంతో రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నది.

07/28/2016 - 04:33

న్యూఢిల్లీ, జూలై 27: బెంగళూరు బుల్స్‌తో బుధవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ లీగ్ మ్యాచ్‌లో పుణెరీ పల్టన్ మూడు పాయంట్ల తేడాతో గెలిచింది. ఈ జట్టు 36 పాయంట్లు సాధించగా, గట్టిపోటీనిచ్చిన బెంగళూరు 33 పాయంట్లు చేసింది. పుణెరీ కెప్టెన్ మన్జీత్ చిల్లార్ 11 పాయంట్ల తో రాణించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీపక్ నివాస్ హూడా తొమ్మిది పాయంట్లు చే శాడు.

07/28/2016 - 03:46

విజయవాడ, జూలై 27: ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ లో రూ.122 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరాన్ని పూర్తిగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సిఎం చెప్పారు. గత విజయవాడకు, భవిష్యత్ విజయవాడకు చాలా తేడా ఉంటుందని ఆయన తెలియచేశారు.

07/28/2016 - 03:44

న్యూఢిల్లీ, జూలై 27: దేశ వ్యాప్తంగా ఒకే పన్నుల విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన వస్తు సేవల బిల్లు (జిఎస్‌టి) ఆమోదానికి కేంద్రం మరింతగా మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ అమలులోకి వచ్చే మొదటి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని నూటికి నూరు శాతం భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించింది.

07/28/2016 - 03:43

హైదరాబాద్, జూలై 27: విదేశాలకు వెళ్లే వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసీ తెలంగాణ దివాస్’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. కేరళ, పంజాబ్ కంటే మెరుగైన ఏన్నారై పాలసీని తీసుకోస్తామన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో బుధవారం ఎన్నారైలతో మంత్రి సమావేశమయ్యారు.

Pages