S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/21/2017 - 04:18

రాజమహేంద్రవరం, జనవరి 20: సిద్ధాంతపరంగా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల హిందూ పండుగల విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని ప్రముఖ జ్యోతిష పండితులు దివంగత మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ కుమారుడు, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం కార్యదర్శి పాలశంకరమూర్తి శర్మ పేర్కొన్నారు. తాజాగా ఉగాది విషయంలో కూడా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల వేరువేరు తేదీల్లో పండుగను జరుపుకోవాల్సి వస్తోందన్నారు.

01/20/2017 - 05:24

కడప, జనవరి 19: ఉక్కుకర్మాగారం సాధన కోసం ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు జివి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు పెద్ద ఎత్తున ప్రజామద్దతు లభిస్తోంది. కుల సంఘాలు, స్వచ్చంద సేవాసంస్థలు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, ముఖ్యంగా యువకులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.

01/20/2017 - 05:21

రాయవరం, జనవరి 19: బ్రాహ్మణ సంక్షేమానికి వచ్చే రెండేళ్లలో ఏడాదికి రూ.170 కోట్లు వంతున నిధులు ప్రభుత్వం నుంచి కోరనున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం నుంచి నిధులు కోరనున్నట్టు తెలిపారు.

01/20/2017 - 05:14

అమరావతి, జనవరి 19: శాసనసభ్యుల కోటా నుంచి శాసన మండలికి జరిగే ఎన్నికల్లో దక్కనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటుపై ఏకైక విపక్షం వైసీపీలో పోటీ పెరుగుతోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు పార్టీ అధినేత జగన్ వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చిన నేతలు కూడా అభ్యర్థిత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

01/20/2017 - 05:14

అమరావతి, జనవరి 19: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలు, పెట్టుబడుల కంటే రాజకీయ వివాదాలు ముదురుపాకాన పడుతున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సిపి అమరావతి కేంద్రంగా ఫక్తు రాజకీయాలు నడపటం ఆసక్తికరంగా మారింది.

01/20/2017 - 05:13

ఖమ్మం, జనవరి 19: పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని, ప్రజాప్రయోజనాల కోసమే రూ.500, 1000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దును 90శాతం మంది ప్రజలు స్వాగతించారన్నారు.

01/20/2017 - 05:08

రాజమహేంద్రవరం, జనవరి 19: గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎన్ సాంబశివరావు చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో పటిష్ఠ వ్యూహంతో ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి నియంత్రణకు అడిషనల్ డిజిపి స్థాయి అధికారితో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.

01/20/2017 - 05:07

నెల్లూరు, జనవరి 19: దేశం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

01/20/2017 - 05:04

విశాఖ (జగదాంబ) జనవరి 19: వాతావరణంలో వస్తున్న మార్పులు, పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల సంఖ్య నేపధ్యంలో విశాఖలో కూడా స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒక పాజిటీవ్ కేసు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది అనుమానిత కేసులను గుర్తించినట్టు వైద్య,ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు.

01/20/2017 - 05:03

శ్రీకాళహస్తి, జనవరి 19: ప్రపంచంలోనే హైందవ సంస్కృతి చాలా గొప్పదని అటువంటి సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కంచికామకోటి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి వివరించారు. గురువారం శ్రీకాళహస్తి ముక్కంటీశుని దేవస్థానం గాలిగోపురం పునర్నిర్మాణం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ జరిగిన అతిరుద్ర యాగంలో ఆయన పాల్గొన్నారు.

Pages