S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/22/2017 - 07:32

కడప, జనవరి 21: కడప జిల్లాలోని గండికోట జలాశయంలో నీటిమట్టం మరింత పెరగడంతో చౌటపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వేసిన మట్టికట్టలను తెంచుకుని నీరు ఊళ్లోకి చేరింది. దీంతో చేసేది లేక జనాలు తట్టాబుట్టా సర్దుకుని పిల్లాపాపలతో తరలివెళ్తున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట జలాశయానికి గత కొన్ని రోజులుగా కృష్ణాజలాలు తరలిస్తున్నారు.

01/22/2017 - 05:31

హైదరాబాద్, జనవరి 21: తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రపంచం నలుదిశలా తెలిసేలా, అమరావతి వేదికగా వచ్చే నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళా పార్లమెంటు మహా సభలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలిపారు.

01/22/2017 - 02:55

విజయనగరం/గంట్యాడ, జనవరి 21: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం ప్రధాన గేట్లలో ఒకటి అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమెకోసం గాలిస్తూ ఓ కానిస్టేబుల్ నీటిలో మునిగి మరణించారు. శనివారం జరిగిన ఈ సంఘటన అధికారులను, స్థానికులను దిగ్భ్రాంత్రికి గురిచేసింది.

01/22/2017 - 02:48

రాజమహేంద్రవరం, జనవరి 21: జాతీయ జల రవాణా ప్రాజెక్టులో కదలిక మొదలైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నాలుగో జల మార్గం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరున శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని రకాల సర్వేలు పూర్తయ్యాయి. జిల్లాలవారీగా సర్వే పూర్తి చేసి అవసరమైన భూమిని గుర్తించామని గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ హరిబాబు తెలియజేశారు.

01/21/2017 - 04:59

ఒంగోలు/కందుకూరు,జనవరి 20: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పిసిపల్లిలో శుక్రవారం ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

01/21/2017 - 04:57

నెల్లూరు, జనవరి 20: నెల్లూరు శివారులో మైపాడు రోడ్డులో ఒక ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకుకు చెందిన ఎటిఎం కార్డులు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం కలకలం రేపింది. నెల్లూరు - మైపాడు రహదారిలో మూడో మైలు రాయి వద్ద ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన భారీ సంఖ్యలో రూపే కార్డుల గుట్టను శుక్రవారం సాయంత్రం స్థానికులు గమనించారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో జనం గుమికూడారు.

01/21/2017 - 04:55

సింహాచలం, జనవరి 20: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 5 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో సుమారు అయిదు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నెడ్‌క్యాప్ పర్యవేక్షణలో హైదారాబాద్‌కి చెందిన ఒక సంస్థ ఈ పనులు చేపడుతోంది.

01/21/2017 - 04:54

భీమవరం, జనవరి 20: అందరూ చెత్త.. చెత్త అని తిట్టుకుంటారు, ఇప్పుడు అదే తడి చెత్త నుంచి చేపలకు, పశువులకు అవసరమైన పోషక విలువలు కలిగిన మేతను తయారుచేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు చెప్పారు.

01/21/2017 - 04:54

కర్నూలు, జనవరి 20: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ప్రభుత్వ రంగం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్‌ఎన్‌ఎల్) పరిస్థితి. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఫైబర్‌నెట్ సేవలు గుదిబండగా మారనున్నాయన్న చర్చ టెలికాం వర్గాల్లో మొదలైంది.

01/21/2017 - 04:52

మైలవరం, జనవరి 20: పనికిరాని (కాలం చెల్లిన) మందులతో పశువులకు వైద్యం చేస్తున్న పశువైద్యాధికారుల నిర్వాకమిది.

Pages