-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, సెప్టెంబర్ 28: ఉద్యోగాలు ఇచ్చే శక్తులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించి ఐదు అంశాలపై అమెరికాలోని ప్రవాసాంధ్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్సుహాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో టీడీపీ-ఎన్నారై సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
* కేంద్ర మంత్రి గంగ్వార్ వెల్లడి
* తిరుపతిలో రూ. 110 కోట్లతో సంస్థ నూతన భవనం ప్రారంభం
-------------------------------------
విజయవాడ, సెప్టెంబర్ 28: అమరావతి రాజధాని పరిధిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు, ఎలాంటి లింగ వివక్షతకు తావులేని విధంగా చేపట్టాల్సిన చర్యలకు అనువైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శరవేగంగా చర్యలు జరుగుతున్నాయి.
విజయవాడ, సెప్టెంబర్ 27: యువనేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులెవరూ కూడా చిన్న చిన్న కారణాలతో ఈ పథకానికి దూరం కాకూడదని అధికారులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో యువనేస్తంపై గురువారం మంత్రి రవీంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అర్హులందరికీ అక్టోబర్ 2న బ్యాంక్ ఖాతాల్లో నిరుద్యోగ భృతి జమ చేస్తామన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 27: ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో పని చేసే ప్రొఫెసర్లు ఎవరైనా భవిష్యత్తులో ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారానికి ఎంపికైతే యాజమాన్యం తరపున ప్రోత్సాహక పారితోషికంగా రూ. కోటి అందజేస్తామని అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రొ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డీ నారాయణరావు గురువారం వెల్లడించారు.
విజయవాడ, సెప్టెంబర్ 27: ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు వద్ద మేజర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ఓడరేవు నిర్మాణానికి తగిన స్థలం కేటాయిస్తే, మేజర్పోర్టును అభివృద్ధి చేసేందుకు సిద్ధమని తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 27: ఉద్యోగాలు లేక ఏళ్ల తరబడి అర్ధాకలితో అలమటిస్తున్నాం... ఎంతకాలం తల్లిదండ్రులపై ఆధారపడాలి... ఇక మాకు చావే శరణ్యం... దూకేస్తాం... దూకేస్తున్నామంటూ దాదాపు 25 మంది నిరుద్యోగ పీఈర్టీ అభ్యర్థులు గురువారం సాయంత్రం విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. దీంతో దాదాపు గంట సేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సైదాపురం, సెప్టెంబర్ 27: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం రాజుపాళెం పంచాయతీ కార్యదర్శి చల్లా సుబ్బరాయులు పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. చాగణంరాజుపాళెంకు చెందిన అబ్బిరాజు 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ఎస్టీ కాలనీవరకు రూ.7 లక్షలతో రోడ్డు పనులు, మరో రూ.లక్షతో పారిశుద్ధ్యం పనులు చేయించారు.
విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అమెరికాలో న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలో సాంకేతికత యుగంలో పరిపాలన అన్న అంశంపై గురువారం చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, ప్రజల్లో సంతృప్తిని పెంచేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటూ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
కాకినాడ, సెప్టెంబర్ 27: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితంచేసే శక్తివున్న రైతులు, డ్వాక్రా సంఘాలకు సంక్షేమ తాయిలాలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది.