S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/11/2018 - 04:09

కూనవరం, ఆగస్టు 10: మరో 20 ఏళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో నిర్వాసిత రైతుల సమస్యలపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వం సాయం అందించనిదే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేదన్నారు.

08/11/2018 - 04:05

విజయవాడ, ఆగస్టు 10: పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతా అనేది వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన, పూర్తిగా ఆర్థిక శాఖ నిర్వహించే వెసులుబాటు కలిగిన ఖాతా అని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర వివరణ ఇచ్చారు. సచివాలయంలో ఆయన శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పీడీ ఖాతాలకు సంబంధించి వివరణ ఇచ్చారు.

08/11/2018 - 04:02

విశాఖపట్నం, ఆగస్టు 10: భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన నేతల నుంచి, దేశ పునర్నిర్మాణానికి త్యాగాలకు పాల్పడిన మహనీయుల నుంచి నేటి యువతరం ప్రేరణ పొందాలి. మహనీయులు వాడిన వస్తువులను ప్రదర్శనశాలలో ఉంచడం ద్వారా మనం వారి స్ఫూర్తి పొందలేం. వారి ఆలోచనలు, మనోభావాలను, త్యాగాలను అర్థం చేసుకున్నప్పుడే, నిజమైన దేశ భక్తులుగా ఎదగగలుగుతామని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

08/11/2018 - 03:00

విజయనగరం, ఆగస్టు 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఇటువంటి తరుణంలో ప్రజలకు నూతన ప్రత్యామ్నాయం కావాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఏఏపీ పార్టీలన్నింటితో కలసి పోరాటం చేస్తున్నామన్నారు.

08/11/2018 - 02:58

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఆగస్ట్10: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణకు సౌత్ వెస్ట్ ఏషియన్ ఫుట్‌బాల్ సమాఖ్య జనరల్ అసెంబ్లీలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ డెలిగేట్‌గా హాజరయ్యే అరుదైన గౌరవం లభించింది.

08/11/2018 - 02:56

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించిన వైఎస్ జగన్మోహనరెడ్డి తన అనుచరులతో కలసి నల్లచొక్కాలు ధరించి వంచనపై గర్జన పేరిట సభ నిర్వహించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.

08/11/2018 - 02:55

విజయవాడ(బెంజ్‌సర్కిల్), ఆగస్టు 10: రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణతో ప్రజలకు చేరువవుతున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ప్రతిష్ఠను చూసి తట్టుకోలేక కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ ఆరోపించారు.

08/11/2018 - 02:53

హైదరాబాద్, ఆగస్టు 10: తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రకేయులతో మాట్లాడుతూ రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిందని అన్నారు.

08/11/2018 - 02:53

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వ్యవహరాలను నియంత్రించే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు పాలకవర్గాన్ని ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెరాకు చైర్మన్‌గా వి.రామ్‌నాథ్‌ను, సభ్యులుగా డాక్టర్ ముళ్లపూడి రేణుక, చందు సాంబశివరావు, శిస్టా విశ్వనాథ్‌లను నియమించింది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులను ఆహ్వానించారు.

08/11/2018 - 02:52

ఆదోని, ఆగస్టు 10: కర్నూలు జిల్లాలో జరిగిన క్వారీ పేలుళ్లలో గాయపడిన మరో కార్మికుడు శుక్రవారం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలోని క్వారీలో గత శుక్రవారం జరిగిన పేలుడులో 10 మంది అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడని ముగ్గురిలో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిషాకు చెందిన రాజేంద్రనాయక్ మంగళవారం మృతి చెందాడు.

Pages