-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జూలై 12: మనదేశానికి చెందిన రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గడచిన జూన్ నెలతో ముగిసిన ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 3,802 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. ఈ మొత్తం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.2 శాతం అధికమని బీఎస్ఈ ఫైలింగ్లో నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,612 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు వివరించింది.
ముంబయి, జూలై 12: వివిధ సంస్థలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న క్రమంలో శుక్రవారం మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించడంతోబాటు వాటాల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో వాణిజ్య వారం చివరి రోజు సైతం స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే నడిచాయి. సూచీలు అద్యంతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా ఫైనాన్షి స్టాక్స్ తీవ్ర నష్టాలకు గురయ్యాయి.
ముంబయి: అంతర్జాతీయ సానుకూలతలతో కేంద్ర బడ్జెట్ తర్వాత గురువారం తొలిసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుని మంచి లాభాలు అందుకున్నాయి. ఈ నెలలోనే రేట్ల కోత ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జరోమ్ పావెల్ సంకేతాలివ్వడం మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రత్యేకించి లోహ, వాహన, ఫైనాన్షియల్ స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి.
న్యూఢిల్లీ, జూలై 11: దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు తీసుకెళ్లగలిగే ఎలాంటి మార్గదర్శకాలూ 2019-20 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో లేవని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం గురువారం రాజ్యసభలో ఆరోపించారు. ఈ బడ్జెట్లో ఎలాంటి పెద్ద నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలూ లేవని ఆయన అన్నారు.
ముంబయి, జూలై 11: సూక్ష్మ స్థాయిలో ఏర్పాటయ్యే పరిశ్రమలు (కుటీర పరిశ్రమలు), వ్యాపారాలకు అందజేసే రుణాల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయ వృద్ధి చోటుచేసుకుంది. మైక్రో ఫైనాన్స్గా వ్యవహరించే ఈ రుణాల్లో 40 శాతం వృద్ధి నెలకొని మొత్తం రూ. 1,27,223 కోట్లకు చేరింది. ఇందులో 10 అగ్రస్థాయి రాష్ట్రాల భాగస్వామ్యం 83 శాతం ఉందని ఎక్వైఫాక్స్, సిడ్బి సంస్థలు సంయుక్తం నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. వైసీపీ పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం చెప్పారు. పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే ఆ సమాఖ్య సిఫారసు చేయవలసి ఉంటుంది..
కొత్తగూడెం, జూలై 10: ఒడిశా రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. బొగ్గు బ్లాకుల అనుమతికి అవసరమైన సహకారం అందించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో అక్టోబర్ నుంచి రైల్వే ప్రయాణికులకు ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా బెర్త్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేలు అక్టోబర్ నుంచి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించబోతున్నాయి. రైళ్లలో లైట్లకు, ఎయిర్-కండీషనింగ్కు అవసరమయిన విద్యుత్తు పవర్ కార్లలో కాకుండా ఇంజన్లలో ఉత్పత్తి కావడానికి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది.
ముంబయి, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల పాలయ్యా యి. ప్రధానంగా చమురు, సహజ వాయులు, లోహ, వాహన రంగాలు అత్యధికంగా నష్టపోయాయి. గత శుక్రవారం నుంచి వరసగా రెండు రోజులపాటు భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం స్వల్పంగా కోలుకున్నప్పటికీ బుధవారం మళ్లీ నష్టాల బాటపట్టాయి.
న్యూఢిల్లీ, జూలై 10: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)కి మంచి స్పందన లభిస్తోంది. ఇపుడు ఈ జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు ఏకంగా లక్ష కోట్ల రూపాయలు దాటాయి.