S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/21/2019 - 04:42

విశాఖపట్నం : విద్యుత్ కార్ల నిర్వహణ ఇపుడిపుడే విజయవంతమవుతోంది. కాలుష్య నియంత్రణకూ ఆస్కారం కలుగుతోంది. మరోపక్క వాహన యజమానులపై పెట్రోల్, డీజిల్ భారం తగ్గుతోంది. సాంకేతికపరమైన సమస్యలనూ అధిగమించడానికి అవకాశం కలుగుతోంది. అయితే ఎటొచ్చీ వీటి నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని గనక అధిగమిస్తే భవిష్యత్ అంతా విద్యుత్ కార్లదే.

07/21/2019 - 01:52

కాచిగూడ, జూలై 20: భారతీయ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్ ప్రవేశ పెట్టిన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉందని అన్నారు. హైదరాబాద్, దీల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.

07/20/2019 - 22:59

నాగ్‌పూర్, జూలై 20: దేశ వ్యాప్తంగా బ్యాంకిం గ్ రంగం ఎనె్నన్నో సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటున్నదని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆందోళన వ్య క్తం చేశారు. శనివారం నాగ్‌పూర్‌లో ఇండియన్ బ్యాంకు జోనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి గడ్కరి ప్రసంగిస్తూ ప్రజలు బ్యాంకులకు ఎప్పటికప్పుడు అంటే గడువులోగా తమ బకాయిలను చెల్లించాలన్నారు.

07/19/2019 - 23:53

సత్యవేడు, జూలై 19: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీసిటీలో జపాన్ దేశానికి చెందిన తొహోకు స్టీల్స్ కంపెనీ లిమిటెడ్ అనుబంధ తొహోకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ప్రారంభించారు. పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ హీరోకి యమడా, ప్రెసిడెంట్ షింజీ నరుసే, వైస్ ప్రెసిడెంట్ షుఖషా నషీమురోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/19/2019 - 21:34

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో విద్యుత్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ అవసరాలు తీరాలంటే దీని శుద్ధి సామర్థ్యాన్ని భారతదేశం 80 శాతం వరకు పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

07/19/2019 - 21:32

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలోని పేద ప్రజల మేలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ (ఉజ్వల యోజన) పథకాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ (ఐఈఏ) ప్రశంసించింది. వాతావరణంతోపాటు మహిళల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన ఈ ఉచిత గ్యాస్ పథకం ప్రభుత్వం సాధించిన ‘గొప్ప ఘనత’గా ఐఈఏ అభివర్ణించింది. ‘్భరతదేశం అంతటా 2020 నాటికల్లా ఎల్‌పీజీ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం గొప్ప ఘన త.

07/19/2019 - 21:03

రూ. 1.40 వేల కోట్ల విలువైన వాటాల విక్రయం ఐఎంఎఫ్ గణాంకాలతోనూ ప్రతికూలతలు
560.45 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 177.65 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

07/19/2019 - 21:02

న్యూఢిల్లీ, జూలై 19: విదేశీ వలసదారులకు చక్కటి ఉపాధినిచ్చే గమ్యస్థానంగా మనదేశం ఎదుగుతోంది. ఈ విషయంలో దేశ ఖ్యాతికూడా ఖండాంతరాలకు విస్తరిస్తోంది. ప్రత్యేకించి నిపుణతకు అనుగుణంగా కెరీర్‌ను మలుచుకునేందుకు, తదనుగుణంగా వేతనాల లభ్యతకు సైతం మన దేశం అనువుగా ఉందని ‘హాంగ్‌కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ) అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.

07/19/2019 - 04:54

న్యూఢిల్లీ : ప్రస్తుత సంవత్సరానికి మనదేశ వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు తయారీ ప్రక్రియను ఆధునీకరించడం వల్ల వాణిజ్యపమైన సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నందువల్ల మనదేశ వృద్ధిరేటు అంచనాలూ తగ్గించాల్సి వచ్చిందని ఏడీబీ పేర్కొంది.

07/19/2019 - 04:51

భీమవరం, జూలై 18: అన్న క్యాంటీన్లలో ఆహారం సరఫరాపై ప్రభుత్వం అనధికార సీలింగ్ విధించింది. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు 800 మందికి మాత్రమే ఆహారం అందించాలని వౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు క్యాంటీన్ నిర్వాహకులు రోజుకు మొత్తంగా 800 మందికి మాత్రమే ఆహారం అందజేస్తున్నారు. ఇందులో ఉదయం 250 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 350 మందికి, రాత్రి 200 మందికి భోజనం అందచేస్తున్నారు.

Pages