-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
రాజమహేంద్రవరం, జూలై 8: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు మందగమనంలో సాగుతున్నాయి. పొగాకు కొనుగోళ్లకు బోర్డు నిర్ణయించిన వంద రోజుల కార్యచరణలో ఇప్పటికే 50 రోజులు దాటినా ఇంకా పలువురు రైతులు వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నారు. ఫలితంగా కొనుగోళ్లు ఇంకా సాగుతున్నాయి.
న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో 26 శాతం వాటాలను డిసినె్వస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వెనక్కు తీసుకోదలుచుకున్నామన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో సమర్థించుకుంది. ఇందుకు సంబందించి అన్ని ముందస్తు చర్యలూ తీసుకోవడం జరిగిందని, ఇందులో జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య ఏదీ ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 8: 3స్టాక్ మార్కెట్లలో తుపాను ముందటి ప్రశాంతత కనిపిస్తోంద2ని బడ్జెట్కు ముందు వెలువడిన విశే్లషకుల అంచనాలు నిజమయ్యాయి. సోమవారం స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోగా రూ.3.39 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఊహించిన స్థాయిలో కేంద్ర బడ్జెట్ లేకపోవడంతోబాటు అంతర్జాతీయ మార్కెట్లలో పెద్దమొత్తాల్లో వాటాల విక్రయాలు జరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి.
రాజమహేంద్రవరం: ఏపీఎస్ ఆర్టీసీ ఆధునిక విధానంలో బలోపేతమవుతోంది. రోజు రోజుకూ ఈ వ్యవస్థ విస్తరిస్తోంది. ఆర్టీసీ విజయనగరం జోన్లో గణనీయమైన ఆదాయం సాధించే దిశగా ఆర్టీసీ కార్గో విస్తరణ జరిగింది. కార్గో పటిష్టవంతంగా నిర్వహిస్తుండటంతో ఆఖరికి పాఠ్య పుస్తకాలు కూడా ఆర్టీసీ కార్గోలో రవాణా జరుగుతోంది.
పుణే, జూలై 7: చక్కెర ఉత్పత్తి మిగులుతుండడం దేశానికి పెద్ద సమస్యగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కాబట్టి చక్కెర ఉత్పత్తిదారులు ఇథనాల్ వైపు దృష్టి మరల్చాలన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ఆదివారం నిర్వహించిన చక్కెర సదస్సు-2020కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
న్యూఢిల్లీ, జూలై 7: విదేశీ మార్కెట్లలో ప్రత్యేక తరహా బాండ్లు (సావరిన్ బాండ్స్) జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆదివారం నాడిక్కడ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ బాండ్లను జారీ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూలై 7: అతి సంపన్న వర్గాలపై పన్నులను పెంచడం, పెట్రోలు, డీజిల్పై సుంకాలను పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది అదనంగా రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరనుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్భూషణ్ పాండే తెలిపారు. అలాగే బంగారంతోబాటు ఇతర విలాస లోహాలపై సుంకాలను పెంచడంతోబాటు, ఉన్నత సంపన్న వర్గాలపై అధిక సర్చార్జీలు విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం మరింతగా పెరుతుందని ఆయన చెప్పారు.
పనాజీ: రానున్న పదేళ్ళ కాలంలో రైల్వేలకు 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రైల్వే మంత్రి పియూష్ గోయల్ శనివారం నాడిక్కడ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రైల్వేలను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూలై 6: దేశంలోని స్టార్టప్ కమ్యూనిటి ఇకనుంచి ఆదాయపు పన్ను అధికారుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ‘ఏంజెల్ ట్యాక్స్’ గురించిన ఆందోళనలు పరిష్కారం అయినందున వారు తమ వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ పేర్కొన్నారు.
విజయవాడ, జూలై 6: ఏపీఎస్ ఆర్టీసీ కొనే్నళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుండగా మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మరోవైపు డీజిల్ ధరల భారం పడింది. కేంద్ర బడ్జెట్లో ఒక రూపాయి సెస్ విధింపు, దీనిపై పెరిగిన ఇతరత్రా పన్నులతో కలిసి లీటర్కు రూ. 2.70 పైసలు భారం పడినట్లయిందని సంస్థ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.