S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/05/2019 - 22:51

న్యూఢిల్లీ, జూలై 5: విద్యుత్ రంగాభివృద్ధికి త్వరలో ఓ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. ప్రత్యేకించి ‘ఒక దేశం..ఒక గ్రిడ్’ అనే విధానాన్ని అమలు చేసేందుకు కృషి జరుగుతోందని ఆమె చెప్పారు.

07/05/2019 - 22:51

న్యూఢిల్లీ, జూలై 5: ప్రభుత్వ ఉన్నతాధికారులు దేశవిదేశాల్లో తమ తమ రంగాల్లో శిక్షణ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 235 కోట్ల రూపాయలకు పైగా తాజా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్‌లో ఉన్నతాధికారుల శిక్షణకు మొత్తం 235.91 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.194.76 కోట్లుగా ఉంది.

07/05/2019 - 22:50

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్రం 2019-20 వార్షిక బడ్జెట్‌లో ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద రూ. 400 కోట్ల రూపాయలను కేటాయించారు. భారత్‌లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్రం ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలుచేస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దానికి రూ.

07/05/2019 - 22:49

న్యూఢిల్లీ, జూలై 5: కేంద్ర బడ్జెట్‌లో సాంస్కృతి, పర్యాటక రంగాలకు స్వల్ప కేటాయింపులే జరిగాయి. పర్యాటక శాఖలో వౌలిక సదుపాయాల కల్పనకు 1,378.53 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ప్రచారం, ప్రోత్సహకాల కింద 575 కోట్లు ఖర్చుచేస్తారు. కేంద్ర సంస్కృతిక వ్యవహారాల శాఖకు 875.33 కోట్లు కేటాయించారు. దేశ వ్యాప్తంగా 17 ప్రసిద్ధ కేంద్రాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దుతారు.

07/05/2019 - 22:49

ఈ మొత్తం రూ. 2.98 కోట్లే. కొత్త ఆయుధాల కొనుగోలు, మిలటరీ హార్డ్‌వేర్, ప్లాట్‌ఫామ్‌లకు లక్షా 8 వేల 248 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. వేతనాలు,ఇతర అవసరాల కోసం రూ. 2,10,682 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకంటే ఇది రెట్టింపు.

07/05/2019 - 22:18

కర్నూలు, జూలై 5: రాయలసీమలో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిపై నీలినీడలు అలముకుంటున్నాయి. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేయాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

07/05/2019 - 22:18

ఉక్కునగరం, జూలై 5: ఉక్కు కిరీటంలో మరో కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ చేరింది. విశాఖ ఉక్కు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవడానికి కొత్త బ్యాటరీ ఆలంబనగా నిలుస్తుంది. రూ.2500 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో కొత్తగా నిర్మించిన కోక్ ఓవెన్ బ్యాటరీ-5 చినీని సీఎండీ పీకే రథ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు.

07/05/2019 - 13:54

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగానే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ కొద్దిగా కోలుకుని 71.56 పాయింట్ల నష్టంతో 39836.50 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 49.75 పాయింట్ల నష్టంతో 11897.00 వద్ద కొనసాగుతోంది.

07/05/2019 - 04:40

ప్రస్తుత ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతూ, రానున్న ఐదేళ్ల కాలంలో
తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
గురువారం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివి...
*
ప జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా
ప 5 ట్రిలియన్‌ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ
లక్ష్యంగా మార్గ నిర్దేశనం
ప 8 శాతం నిలకడ అభివృద్ధితోనే ఈ

07/05/2019 - 00:52

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖను చేపట్టిన మొదటి మహిళా మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించనున్న 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఐటీ మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయనే మాట గట్టిగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌పై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి.

Pages