S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/07/2019 - 23:01

ముంబయి, ఏప్రిల్ 7: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)పై ప్రధానంగా ఆధారపడిన ముంబయి నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థ ‘పొద్దార్ హౌసింగ్’ పెద్దయెత్తున సంస్థ కార్యకలాపాలను విస్తరణకు ప్రణాళికలను రూపొందించింది. వచ్చే కొన్ని సంవత్సరాల కాలంలో సుమారు 41వేల యూనిట్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథం ద్వారా చేపట్టాలని నిర్ణయించింది.

04/07/2019 - 22:59

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

04/07/2019 - 22:58

ముంబయి, ఏప్రిల్ 7: కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉషాపధీకి ‘పవన్ హాన్స్’ లిమిటెడ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యలను ప్రభుత్వం అప్పగించింది. ఆ కంపెనీ ఈమేరకు ఆదివారం నాడిక్కడ ఓ ప్రకటనను విడుదల చేసింది.

04/07/2019 - 22:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో కలిపి 33,492 మిలియన్ డాలర్ల మేరకు వస్తే, ఆ జాబితాలో సింగపూర్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. గత ఏడాది ఏప్రిల్‌తో మొదలై, డిసెంబర్‌తో ముగిసిన మూడు త్రైమాసికాల ఎఫ్‌డీఐలను పరిశీలిస్తే, సింగపూర్ వాటా ఏకంగా 12,976 మిలియన్ డాలర్లు.

04/07/2019 - 03:34

ముంబయి: స్టాక్ మార్కెట్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఊతమిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, దేశం లో స్టాక్ మార్కెట్లు కుదేలు కాకుండా ఉన్నాయంటే, అందు కు సెబీ చేపటుతున్న చర్యలు, ఆమోదించిన తీర్మానాలే ప్రధాన కారణం.

04/07/2019 - 03:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కువైట్ దీనార్ విలువను భారత కరెన్సీలో అత్యధికంగా 233.05 రూపాయలుగా నిర్ధారించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి మారకపు విలువను ఖరారు చేశారు. దీని ప్రకారం, విదేశీ ద్రవ్య విలువ దిగుమతులకు ఎక్కువగా, దిగుమతులకు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కువైట్ దినార్ విలువ దిగుమతుల సమయంలో 233.05 రూపాయలుకాగా, ఎగుమతులు చేసినప్పుడు లభించేది రూ.217.35 మాత్ర మే.

04/07/2019 - 03:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: విజ్ఞాన శాస్త్రంపై మరింతగా నిధుల ఖర్చును పెంచడం ద్వారా వచ్చే మూడేళ్లలో దేశ వృద్ధిరేటును దాదాపు 1.2 శాతం పెంచేందుకు వీలుంటుందని నీతిఆయోగ్ సభ్యులు కే. సరస్వత్ గురువారం నాడిక్కడ సూచించారు. అలాగే విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న సంస్థలు కూడా సమాజాభివృద్ధికి, మార్పునకు దోహదం చేసే విషయాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

04/07/2019 - 03:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలో లిస్టెడ్ కంపెనీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆజమాయిషీ చేసే సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మోసపూరితంగా వ్యవహరించే కంపెనీల తీరు మారడం లేదు. సెబీ విధిస్తున్న జరిమానాలు కూడా ఫలితం ఇవ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, మోసపూరిత కంపెనీలు ఏవీ సెబీ చర్యలకు భయపడడం లేదు.

04/07/2019 - 03:27

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.80
వెండి
8 గ్రాములు: రూ. 324.00

04/07/2019 - 03:26

ముంబయి, ఏప్రిల్ 6: పేరుకుపోతున్న రాని బాకీల వసూళ్లపై ఆర్బీఐ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే, గతంలో జారీ చేసిన సర్క్యులర్ స్థానంలోనే, సవరించిన సర్క్యులర్‌ను విడుదల చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఒకటిరెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రావచ్చని అంటున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, వడ్డీ రేట్లను రెండు పర్యాయాలు తగ్గించిన విషయం తెలిసిందే.

Pages