S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/29/2019 - 20:05

బీజింగ్‌లో చైనా ఉప ప్రధాని లియో హే (మధ్య)తో కరచాలనం చేస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్. చిత్రంలో యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్టీవెన్ ముచిన్ కూడా ఉన్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

03/29/2019 - 20:02

అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణును ప్రదర్శించ డంతో, దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైన కూడా కనిపించింది. సెనె్సక్స్ లాభాల్లో ముగిసింది. నిఫ్టీ కూడా లాభాలను ఆర్జించింది. మొత్తం మీద ఈవారం మార్కెట్ లాభాల్లో ముగిసింది. శని, ఆది వారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. సోమవారం తిరిగి మొదలవుతుంది.

127 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్

03/29/2019 - 20:00

న్యూఢిల్లీ, మార్చి 29: సువెన్ లైఫ్ సైనె్సస్ ఉత్పత్తి చేస్తున్న ఔషధాలను యూరేసియా, ఐరోపా, దక్షిణకొరియా, శ్రీలంక దేశాల మార్కెట్లలో విక్రయించేందుకు సంబంధించిన ప్రాడక్టు పేటెంట్ హక్కులు మంజూరయ్యాయి. నరాలకు సంబంధించిన ప్రమాదకరమైన రోగాలను నయం చేయగలికే సరికొత్త రసాయనికతతో కూడిన ఈ ఔషధాలకు వివిధ దేశాల్లో పేటెంట్ హక్కులు లభించడం పట్ల సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హర్షం వ్యక్తం చేసింది.

03/29/2019 - 20:00

న్యూఢిల్లీ, మార్చి 29: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)సహా అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేటు యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో మొదలై, జూన్‌తో ముగిసే మొదటి త్రైమాసికానికి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయరాదని ప్రభుత్వం తీర్మానించింది.

03/29/2019 - 19:59

న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్జాతీయ మార్కెట్ నుంచి కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (కేపీటీఎల్) భారీ ఆర్డర్లను సంపాదించింది. వీటి విలువ 588 కోట్ల రూపాయలని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగంలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8,500 కోట్ల రూపాయల మేరకు ఆర్డర్లను పొందింది. వీటిలో విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఉన్నాయి.

03/29/2019 - 19:58

న్యూఢిల్లీ, మార్చి 29: మార్కెట్ విలువలో దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్‌ఎఫ్) లిమిటెడ్స్ తన వాటాలను దేశీయ సంస్థాగత మదుపరులకు విక్రయించడం ద్వారా 3,173 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) ఇస్యూ ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగిందని శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది.

03/29/2019 - 19:57

న్యూఢిల్లీ, మార్చి 29: బులియన్ మార్కెట్‌లో రోజురోజుకూ పైపైకి పోతున్న పసిడి ధర శుక్రవారం దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ఏకంగా 395 రూపాయలు పతనమై, 32,700 రూపాయలకు చేరింది. 33,095 రూపాయల వద్ద మొదలైన లావాదేవీలు ప్రారంభం నుంచే నష్టాలను చవిచూశాయి. అటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులుగానీ, ఇటు దేశీయ మదుపరులుగానీ ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, బులియన్ మార్కెట్ నీరుగారిపోయింది.

03/29/2019 - 19:56

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,145.00
8 గ్రాములు: రూ.25,160.00
10 గ్రాములు: రూ. 31,450.00
100 గ్రాములు: రూ.3,14,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,363.636
8 గ్రాములు: రూ. 26,909.088
10 గ్రాములు: రూ. 33,636.36
100 గ్రాములు: రూ. 3,36,363.60
వెండి
8 గ్రాములు: రూ. 332.00

03/28/2019 - 22:29

న్యూఢిల్లీ, మార్చి 28: బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాములపై రూ.35 పెరిగి మొత్తం ధర 33,095కు చేరింది. వరుసగా రెండు రోజులుపాటు నష్టాలను చవిచూసిన పసిడి ఇప్పుడు కోలుకోవడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.

03/28/2019 - 22:26

న్యూఢిల్లీ, మార్చి 28: తమ బ్యాంకు ఆర్థికంగా కోలుకునేందుకు రూ.1186 కోట్ల పెట్టుబడులను పెట్టిన కేంద్రప్రభుత్వానికి 13.89 కోట్ల వాటాలను కేటకాయించినట్లు ప్రభుత్వ రంగ సంస్థ్ధ బ్యాంకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. పది రూపాయల ముఖ విలువ కలిగినవి కేటాయించామని బ్యాంకు పేర్కొంది. కాగా వీటి ఈక్విటీ వాటా విలువ రూ.85.33 రూపాయలని, వీటి మొత్తం విలువ రూ.1186 కోట్లని బ్యాంకు పేర్కొంది.

Pages