-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20
వాషింగ్టన్, మార్చి 23: అమెరికా ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటున్నది. చట్టసభకు, దేశాధ్యక్షుడికి మధ్య సయోధ్య సక్రమంగా లేకపోవడంతో, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. అధికార రిపబ్లిక్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ అడ్డుకుంటున్నది.
ముంబయి, మార్చి 23: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లాభాల్లో మొదలై, వరుసగా మూడు రోజులు ఉత్సాహంగా సాగినప్పటికీ, చివరి రోజున నష్టాలను మూటగట్టుకుంది. వరుసగా ఎనిమిది రోజులు లాభాల్లో సాగిన మార్కెట్ వా రాంతంలో నష్టం ఎదుర్కోవడం మదుపరులనేగాక, స్టాక్ బ్రోకర్లను కూడా ఆందోళనకు గురి చేసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం 38,024.32 పాయింట్లతో ప్రారంభమైన సెనె్సక్స్ 38,095.07 పాయింట్ల వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, మార్చి 23: తమ సంస్థకు చెందిన జనరిక్ లెవోథైరాక్సిన్ సోడియం మాత్రలను అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు ఔషధ తయారీ సంస్థ ‘లుపిన్ లిమిటెడ్’ శుక్రవారం నాడిక్కడ తెలిపింది. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ఆమోదం పొందిన అనంతరం ఈ మాత్రల తయారీని చేపట్టడం జరిగిందని లుపిన్ శుక్రవారం సమర్పించిన బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది.
న్యూఢిల్లీ, మార్చి 22: బంగ్లాదేశ్ నుంచి జనపనార సంచుల దిగుమతులపై విధించిన యాంటీ డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. బంగ్లాదేశ్ నుంచి వీటి దిగుమతిని నిరుత్సాహ పరచకుంటే దేశీయంగా జనపనార ఉత్పత్తులతో సంబంధం ఉన్నవారు దెబ్బతింటారు. అందువల్ల వీటి దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది.
ముంబయి, మార్చి 22: వరుసగా ఎనిమిది రోజులు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) ఆర్జించిన లాభాలకు తొమ్మిదో రోజైన శుక్రవారం బ్రేక్ పడింది. సెనె్సక్స్ 222.14 పాయింట్లు (0.58 శాతం) కోల్పోయి, 38,164.61 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్ఎస్ఈ)లోనూ బుల్ రన్ ఆగిపోగా, నిఫ్టీ 64.15 పాయింట్లు (0.54 శాతం) పతనమై, 11,456.90 పాయింట్లకు చేరింది.
ముంబయి, మార్చి 22: సైబర్ భద్రతకు సంబంధించిన సేవారంగంలో పేరు సంపాదించిన ఔజాస్ కంపెనీని జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్ఎస్ఈ) కొనుగోలుచేసింది. 2008లో స్టాక్ మార్కెట్లోకి లిస్టింగైన ఈ కంపెనీని కొనడం ద్వారా ఎన్ఎస్ఈ మరింత మెరుగైన సేవలను అందించగలుగుతుంది.
న్యూఢిల్లీ, మార్చి 22: వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆటో మొబైల్ అమ్మకాలు మందకొడిగా ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. బీఎస్-6 ఎమిషన్ మార్గదర్శకాలు వస్తున్నందున రెండవ ఆరు నెలల్లో అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. గత పది నెలల్లో ప్రయాణికుల వాహనాల క్రయ విక్రయాల్లో 4 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది.
న్యూఢిల్లీ, మార్చి 22: మైసూర్ నంజన్గడ్లో గల జుబిలియంట్ లైఫ్ సైనె్సస్ సంస్థకు చెందిన ఔషధ తయారీ పరిశ్రమపై అమెరికాకు చెందిన ఆరోగ్య నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈమేరకు ఆ నియంత్రణ విభాగం తమ సంస్థకు తక్కువ స్థాయి క్లాసిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని శుక్రవారం జుబిలియంట్ లైఫ్ సైనె్సస్ సంస్థ స్వయంగా సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లోప్రకటించడం గమనార్హం.
ముంబయి, మార్చి 22: ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ (ఆర్సిల్)లో ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టి, భాగస్వామిగా మారింది. న్యూయార్క్లో కేంద్ర కార్యాలయం ఉన్న అవెన్యూ గ్రూప్లో ఒక భాగమైన ఎవెన్యూ ఇండియా రిసర్జెన్స్ కంపెనీ కొంత మంది వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఆర్సిల్ వాటాలను కొనుగోలు చేసింది.