S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/18/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 18: భారత దేశంలో తయారైన వివిధ రకాలైన కాఫీ బ్రాండ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రత్యేకించి ఇటలీలో భారత కాఫీకి డిమాండ్ ఎక్కువ. వివిధ దేశాలకు జరుగుతున్న కాఫీ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 66,817 టన్నుల కాఫీ ఎగుమతికాగా, ఈ ఏడాది, మార్చి ఐదో తేదీ నాటికి 74,811 టన్నుల కాఫీ ఎగుమతి అయింది.

03/18/2019 - 22:46

పనాజీ, మార్చి 18: గోవాలో ఇనుమ ఖనిజ తవ్వకాలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ప్రశ్న స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నది. వేలాది మందికి ఇక్కడి మైనింగే ఆధారం. గత ఏడాది మార్చి మాసంలో ఇనుప ఖనిజ మైనింగ్‌ను నిలిపివేసిన మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఇప్పటి వరకూ దాని పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

03/18/2019 - 22:44

న్యూఢిల్లీ, మార్చి 16: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని, వాటిని చెల్లించకుండా ఇంగ్లాండ్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యకు చెందిన కంపెనీల దివాలా ప్రక్రియ జోరందుకుంది.

03/17/2019 - 23:35

న్యూఢిల్లీ, మార్చి 17: వివిధ వాణిజ్య సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈనెల 26న సమావేశం కానున్నారు. ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు, వడ్డీ రేటుపైన కూడా ఆయన చర్చిస్తారు. ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ/ ఎంసీపీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి ఏప్రిల్ 4న సమావేశం కానుంది.

03/17/2019 - 23:34

న్యూఢిల్లీ, మార్చి 17: పేరు మార్చాలన్న ఐడీబీఐ బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 51శాతం వాటాలను కొనుగో లు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, ఐడీబీఐ బ్యాంక్ అనే పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్ లేదా ఎల్‌ఐసీ బ్యాం క్ అని మార్చేందుకు అనుమతించాలన్న ప్రతిపాదన ఆర్బీఐ ముందుకు వచ్చింది.

03/17/2019 - 23:32

న్యూఢిల్లీ, మార్చి 17: హాస్పిటాలిటీ రంగంలో దూసుకెళుతున్న ఎల్లో టై కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో పడింది. రెస్ట్రాంట్స్ విస్తరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పటికే దేశంలోని 15 ప్రధాన నగరాల్లో 50 అవుట్‌లెట్స్‌ను ఎల్లో టై సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా మరో 60 అవుట్‌లెట్స్‌ను తెరవాలన్నది ఎల్లో టై ఆలోచన. ఈ దిశగా ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది.

03/17/2019 - 23:37

గత వారం స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా ఉండడంతో, అదే తరహా వ్యాపార లావాదేవీలను రాబోయే వారంలో కూడా ఊహించుకోవచ్చు. బీఎస్‌ఈలో 50 ఇండెక్స్ 3.7 శాతం బలపడగా, నిఫ్టీ 3.5 శాతం పెరిగింది. బీఎస్‌ఈలోని టాప్ పదింటిలో ఎనిమిది కంపెనీలు లాభాలను ఆర్జించాయి. ఈ కంపెనీల వాటాల ధరలు పెరగడంతో, వాటి విలువ 1,42,643.20 కోట్ల రూపాయలు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెరిసిపోయాయి.

03/17/2019 - 23:29

న్యూఢిల్లీ, మార్చి 17: వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? వివిధ మాధ్యమాల్లో ప్రకటనలను ఆకట్టుకునే విధంగా ఎలా సిద్ధం చేసుకోవాలి? ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? సహజంగా అటు ఉత్పత్తిదారులను, ఇటు హోల్‌సేలర్లు, రీటైలర్లను వేధించే ప్రశ్నకు ఒకటే సమాధానం లభిస్తున్నది. మహిళలను ఆకట్టుకుంటేనే ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుందనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ బలంగా నాటుకుంది.

03/17/2019 - 05:23

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో ఈవారం బుల్ రన్ కొనసాగింది. లాభాల్లో పరుగులు తీసింది. గురువారం ఫ్లాట్‌గా ముగియడంతో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ, ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ మళ్లీ కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈవారం ప్రారంభంలోనే సెనె్సక్స్ గత ఆరు నెలల గరిష్టానికి చేరుకోవడం విశేషం.

03/16/2019 - 22:53

వాషింగ్టన్, మార్చి 16: భారత్‌తో వాణిజ్య, మార్కెట్ అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. నిర్ధిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని భారత్‌కు సూచించింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న సుమారు 50 ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి పన్నులు విధించడం లేదు.

Pages