S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/06/2019 - 04:29

హైదరాబాద్: ప్రతి రోజూ 5000 వేల టన్నుల బొగ్గును దేశంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి అవసరమైన రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం సింగరేణి సీఎండీ రైల్వే అధికారులతో భేటీ అయ్యారు. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ మధుసూదనరావుతో ఆయన చర్చలు జరిపారు.

02/06/2019 - 04:19

విశాఖపట్నం: జపాన్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికి మన యువత ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవతో తొలిసారి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జపాన్ జాబ్ ఫెయిర్‌లో విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే జపాన్ కంపెనీల అభిమానాన్ని చూరగొన్నారు.

02/06/2019 - 02:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరావసరాలకు అనుగుణంగా డేటెడ్ సెక్యూరిటీల ద్వారా 36వేల కోట్ల రూపాయలు అదనంగా సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్ మేరకు ప్రభుత్వ బాండ్ల ద్వారా చేపట్టిన చివరి ట్రాంచే కాలపమితి వచ్చే మార్చి 8తో ముగుస్తుంది.

02/05/2019 - 23:18

ముంబయి, ఫిబ్రవరి 5: వరుసగా రెండు రోజు ల నష్టాల పరంపర నుంచి భారత రూపాయి మంగళవారం కోలుకుంది. అమెరికన్ డాలర్‌తో 23పైసలు బలపడి రూపాయి విలువ 71.57 రూపాయలకు చేరింది. విదేశీ నిధులు పెద్దమొత్తంలో పెట్టుబడులుగా రావడంతోబాటు, దేశీయ మార్కె ట్లు లాభాలతో ముగియడం రూపాయి బలోపేతానికి దోహదం చేసిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

02/05/2019 - 23:17

ముంబయి, ఫిబ్రవరి 5: దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు మంగళవారం ఊగిసలాట, అస్థిరతలకులోనై మళ్లీ కోలుకుని దృఢంగామారి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. రిజర్వు బ్యాంకు మానిటరీ పాలసీ సమీక్షా సమావేశం కొనసాగుతున్న సందర్భంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. విదేశీ మార్కెట్ల నుంచి ఆశించినంత సానుకూలత లేకపోవడం సైతం దేశీయ మార్కెట్ల ఊగిసలాటకు కారణమని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

02/05/2019 - 23:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశీయ మార్కెట్లలోని మూచువల్ ఫండ్స్‌లోకి గడచిన జనవరి నెలలో రూ.7వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడచిన యేడాది ఇదే నెలలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలోని వాటాల విక్రయాలకు పాల్పడటంతో మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులకు వరంగా మారిందని మార్కెట్ రం గ నిపుణులు అంచనా వేస్తున్నారు.

02/05/2019 - 23:14

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,249.00
8 గ్రాములు: రూ.25,992.00
10 గ్రాములు: రూ. 32,490.00
100 గ్రాములు: రూ.3,24,900.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,474.866
8 గ్రాములు: రూ. 27,798.928
10 గ్రాములు: రూ. 34,748.66
100 గ్రాములు: రూ. 3,47,486.6
వెండి
8 గ్రాములు: రూ. 331.20

02/05/2019 - 04:57

నిజామాబాద్: తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంట సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో సరైన ప్రోత్సాహం అందక ఈ పంటను సాగు చేసే రైతులు నీరసించిపోతున్నారు. ఓ వైపు మద్దతు ధర అందక, మరోవైపు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో, కనీసం పసుపు ఆధారిత పరిశ్రమలైనా ఏర్పడితే తమకు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని ఆశించిన స్థానిక రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది.

02/05/2019 - 05:05

ముంబయి, ఫిబ్రవరి 4: ఈనెల ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ టారిఫ్ విధానం కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేలా, టెలివిజన్ చానల్స్ నిర్వాహకులకు కాసులు కురిపించేలా ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది.

02/05/2019 - 02:13

గుంటూరు, ఫిబ్రవరి 4: గుంటూరు మిర్చియార్డుకు మిర్చిబస్తాలు పోటెత్తాయి. రైతులు మిర్చిపంటను విక్రయించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. సోమవారం ఒక్కరోజులోనే 1,11,941 బస్తాల మిర్చి యార్డుకు చేరింది. ఒక్కసారిగా వచ్చి పడిన సరుకుతో యార్డు కిటకిటలాడింది.

Pages