S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/08/2019 - 01:39

ముంబయి, జనవరి 7: ఈక్విటీ బెంచ్ మార్కు సెనెక్స్ సోమవారం 155 పాయింట్లు ఎగబాకి 35,850 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు దోహదం చేశాయని, ప్రధానంగా చైనా-అమెరికా వాణిజ్య బంధాలు మెరుగవుతాయన్న సంకేతాలు భారత మార్కెట్లకు ఊతమిచ్చాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

01/08/2019 - 01:36

హైదరాబాద్, జనవరి 7: పెడెక్స్‌కు ఫార్చూస్ మేగజైన్ గుర్తింపు లభించింది. 2018 బెస్ట్ వర్క్‌ప్లేసెస్ ఫర్ డైవర్సిటీ జాబితాలో (వైవిధ్యత గల ఉత్తమ కార్యాలయాలు 2018లో) స్థానం లభించింది.

01/08/2019 - 01:35

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుతం దేశానికి అవసరమైన మేరకు కరెన్సీని అందుబాటులో ఉంచామని, ఒకవేళ ఆర్థిక రంగంలోద్రవ్యలోటు ఏర్పడే పక్షంలో సెంట్రల్ బ్యాంకు దానిపై చర్యలు తీసుకుంటుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు.

01/08/2019 - 01:33

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,128.00
8 గ్రాములు: రూ.25,024.00
10 గ్రాములు: రూ. 31,280.00
100 గ్రాములు: రూ.3,12,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,345.455
8 గ్రాములు: రూ. 26,763.64
10 గ్రాములు: రూ. 33,454.55
100 గ్రాములు: రూ. 3,34,545.5
వెండి
8 గ్రాములు: రూ. 330.40

01/07/2019 - 04:34

న్యూఢిల్లీ: ఆధార్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల మన దేశ ఆర్థిక రంగంపై పెనుమార్పును చూపిందని, ఈ పథకం ద్వారా ఆదా చేసిన డబ్బుతో ఇప్పుడు దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్‌భారత్ లాంటి మూడు పెద్ద సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

01/07/2019 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రధాన మార్కెట్ల నుంచి గడచిన యేడాది 83 వేల కోట్ల రూపాయలు మదుపర్లు వెనక్కు తీసుకున్నారు. అదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు మదుపు చేశారు. అమెరికాలో ధరల పెరుగుదలతోబాటు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువలో తగ్గుదల పెట్టుబడులపై ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/07/2019 - 01:46

ముంబయి, జనవరి 6: స్టాక్ మార్కెట్ పయనం ఎటు? ఈ ఏడాది మొదటి వారం అనిశ్చితిలో కొనసాగిన బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లావాదేవీలు రాబోయే వారంలోనైనా కోలుకుంటాయా? అమెరికా, చైనా దేశాలకు చెందిన ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై జరపబోయే చర్చలు ఎంత వరకు ఫలిస్తాయి? వాటి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై ఏ స్థాయిలో ఉంటుంది? విదేశీ పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తే, దేశీయ మదుపరులు ఆదుకునే అవకాశం ఉందా?

01/07/2019 - 01:44

ముంబయి, జనవరి 6: గడచిన యేడాది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అమాంతం పెరగడం దేశ స్థూల వార్షికావృద్ధి పరుగుకు పగ్గాలు వేసేదిగా మారిందని, ప్రస్తుత వార్షిక నష్టాల పద్దు (సీఎడీ)ని ఇది మరింతగా పెంచుతుందని రిజర్వు బ్యాంకుకు చెందిన ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

01/06/2019 - 02:44

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో సమ్మెకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పెన్షన్ ప్లాన్ వంటి పలు డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించాల్సిందిగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) పిలుపునిచ్చాయి.

01/06/2019 - 02:09

ముంబయి, జనవరి 5: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని నిండాముంచేసి విదేశాల్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్వదేశం రావడానికి సాకులు వెదుకుతున్నాడు. పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాని నిందితుడైన నీరవ్ భారత్‌లో తనకు భద్రత లేదని, అందుకే రాలేనని శనివారం కోర్టుకు తెలిపాడు. పైగా రాజకీయ దురుద్దేశంతోనే తనను కేసులో ఇరికించారని ఆయన ఆరోపించాడు.

Pages