S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/12/2018 - 00:50

న్యూఢిల్లీ, మే 11: పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) గత ఐదు నెలల్లో కనిష్ట స్థాయిలో మార్చి నెలలో 4.4 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2016-17లో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 4.6 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, ఈ రేటు 2017-18లో 4.3 శాతానికి తగ్గింది. గత ఏడాది ఐఐపి వృద్ధిరేటు 4.4 శాతం నమోదు కాగా, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రికార్డయింది.

05/12/2018 - 01:05

ముంబయి, మే 11: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఉత్సాహపూరిత వాతావరణం దన్నుగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బాగా బలపడ్డాయి. కీలక సూచీలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఒక్క సెషన్‌లోనే 290 పాయింట్లు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మళ్లీ కీలకమయిన 10,800 పాయింట్ల పైన ముగిసింది.

05/12/2018 - 01:23

న్యూఢిల్లీ, మే 11: ‘రోటావాక్’ వ్యాక్సిన్ రూపొందించిన బయోఫార్మన్యూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌కు ప్రతిష్ఠ పురస్కారం లభించింది. 20వ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా సాంకేతిక పురస్కారాన్ని శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ మోహన్, వైరల్ వ్యాక్సిన్ డైరెక్టర్ హర్షవర్ధన్ సంయుక్తంగా అందుకున్నారు.

05/12/2018 - 01:08

కొత్తగూడెం, మే 11: సింగరేణి యాజమాన్యం సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు చేపడుతోందని సింగరేణి చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. తొలి దశలో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ. 1360 కోట్ల అంచనా వ్యయం తో ముందుకు సాగుతున్నట్లు శుక్రవారం హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించినట్లు ప్రకటించారు.

05/12/2018 - 00:40

న్యూఢిల్లీ, మే 11: ఫ్లిప్‌కార్ట్‌లో తనకు ఉన్న 20 శాతం వాటాలను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌కు విక్రయించే ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణ యం తీసుకోలేదని జపాన్ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న ట్లు వాల్‌మార్ట్ ప్రకటించిన విషయం విదితమే.

05/11/2018 - 01:02

ముంబయి, మే 10: దేశీయంగా పౌర, రక్షణ రంగ అవసరాలకు ఉపయోగపడే విధంగా విమానాలను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అమెరికాను కోరారు. గురువారం ఇక్కడ భారత్-అమెరికా ఆరవ విమానయాన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానయాన రంగానికి సంబంధించిన టెక్నాలజీలో అమెరికా ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసే స్థితిలో ఉందని ప్రశంసించారు.

05/11/2018 - 00:48

న్యూఢిల్లీ, మే 10: మొబైల్ సర్వీసు ప్రొవైడర్ కంపెనీల విలీనం ప్రక్రియ ఊపందుకుంది. ఒక నెలరోజుల్లోనే ఎయిర్‌టెల్, టెలినార్ కంపెనీల విలీనం ప్రక్రియకు అనుమతి ఇస్తామని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. అలాగే ఐడియా, వొడాఫోన్‌ల విలీనం కూడా వీలైనంత త్వరలో ముగుస్తుందని ఆమె చెప్పారు. ఐడియా, వోడాఫోన్ల విలీనంలో ఎటువంటి జాప్యం లేదని, అలాగే ఆటంకాలు కూడా లేవని ఆమె చెప్పారు.

05/11/2018 - 00:59

లండన్, మే 10: మద్యం వ్యాపారి, భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పరారై లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు ఇంగ్లాండ్ కోర్టులో చుక్కెదురైంది. మాల్యాపై యుకె హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో, ఆయనను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు దర్యాప్తు ఏజన్సీలు భావిస్తున్నాయి.

05/11/2018 - 01:00

ముంబయి, మే 10: మూడు రోజుల పాటు లాభాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడిన పరిస్థితుల్లో మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉండటం వల్ల మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పడిపోయాయి. కర్ణాటకలో శనివారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మార్కెట్‌లో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు.

05/11/2018 - 00:42

న్యూఢిల్లీ, మే 10: ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ కంపెనీ రూ.1.05 కోట్లతో టేకోవర్ చేయాలన్న నిర్ణయం భారత్‌లో విదేశీపెట్టుబడుల ప్రవాహంపై సానుకూల ప్రభావం పడుతుందని, భారత్ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుందని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఒప్పందం భారత్ విదేశీ పెట్టుబడుల మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందని చెపద్పారు.

Pages