-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జూన్ 7: దక్షిణ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జి.. మంగళవారం ఓ సరికొత్త ‘మస్కిటో అవే టీవీ’ని దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. దీని ధరల శ్రేణి 26,900 రూపాయల నుంచి 47,500 రూపాయల మధ్య ఉంది. ‘ఈ ఎల్జి మస్కిటో అవే టీవీ భారతీయ వినియోగదారులకు చక్కగా సరిపోతుంది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ టెలివిజన్లో ఓ అల్ట్రా సోనిక్ డివైస్ను అమర్చాం.
విజయవాడ, జూన్ 7: కృష్ణా జిల్లాలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత ముమ్మరం కానున్నందున మచిలీపట్నం కేంద్రంగా మరో ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వరంగ చమురు ఉత్పాదక దిగ్గజాలైన ఒఎన్జిసి, గెయిల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 7: జపాన్ ఆటోరంగ దిగ్గజం నిస్సాన్.. మంగళవారం భారతీయ మార్కెట్కు డాట్సన్ ‘రెడీ-గో’ కారును పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర 2.38 లక్షల రూపాయల నుంచి 3.34 లక్షల రూపాయల మధ్య ఉంది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ తదితర చిన్న కార్లకు పోటీగా డాట్సన్ బ్రాండ్లో నిస్సాన్ ఈ రెడీ-గోను ముందుకు తెచ్చింది.
హైదరాబాద్, జూన్ 7: ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగం.. బిగ్బజార్ తమ వినియోగదారులకు ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ఇక ప్రతి నెలా మొదటి 8 రోజులు (1 నుంచి 8వ తేదీ మధ్య) తమ స్టోర్లలో జరిపే 2,500 రూపాయలకుపైగా కొనుగోళ్లపై 2,000 రూపాయల విలువైన ‘మంత్లీ క్యాష్/ బోనస్ వోచర్ల’ను వినియోగదారులకు ఇవ్వనుంది.
ముంబయి, జూన్ 7: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య.. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే ఈసారి భట్టాచార్య ఐదు స్థానాలు ఎగబాకడం గమనార్హం. ఇక ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో భట్టాచార్య ఐదో స్థానంలో ఉన్నారని ఓ ప్రకటనలో మంగళవారం ఎస్బిఐ చెప్పింది.
న్యూఢిల్లీ, జూన్ 6: కీలకమైన ఔషధాల ధరలను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) తగ్గించింది. క్యాన్సర్, డయాబెట్స్, రక్తపోటు, బ్యాక్టీరియల్ ఇనె్ఫక్షన్ల వ్యాధులకు చికిత్సగా అందించే 56 రకాల ఔషధాల ధరలను దాదాపు 25 శాతం మేర ఎన్పిపిఎ తగ్గించింది. అయినప్పటికీ మరికొన్ని రకాల ఔషధాల ధరలను పెంచుతూ ఎన్పిపిఎ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రభుత్వరంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టిపిసి.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇక్కడ ఎన్టిపిసి ఆర్థిక విభాగం డైరెక్టర్ కులమని బిస్వాల్ సోమవారం విలేఖరులకు తెలిపారు. విదేశీ బాండ్ల మార్కెట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు, దేశీయ మార్కెట్ నుంచి 14,000 కోట్ల రూపాయల నిధులను రాబట్టాలని చూస్తున్నట్లు చెప్పారు.
జెనీవా, జూన్ 6: భారత్ను స్విట్జర్లాండ్ల సమూహంగా మార్చాలనుకుంటున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తన స్విస్ పర్యటన సందర్భంగా సోమవారం మోదీ.. భారత్లో 2-3 స్విట్జర్లాండ్లను నిర్మించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఇందులోభాగంగానే స్విస్ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్లో పెట్టుబడులను పెట్టాలని వారిని ఆహ్వానించారు.
హైదరాబాద్, జూన్ 6: పొదుపు ఖాతాలపై నానాటికీ వడ్డీ శాతం తగ్గిపోతున్న నేపథ్యంలో 6 శాతం వడ్డీకి కట్టుబడి ఉన్నామని దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూన్ 6: ముస్లీం సోదరుల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రైవేట్రంగ టెలికామ్ సంస్థ ఎయిర్సెల్ వినియోగదారులకు సరికొత్త ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. లోకల్, ఎస్టిడి, ఐఎస్డి కాల్స్పై ఈ ఆఫర్లను ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్లకు చేసే కాల్స్పై రాయితీలుంటాయని చెప్పింది.