S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/23/2017 - 06:40

ఖాతాలున్నవారికి సైతం బ్యాంకుల్లో నగదు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో పెద్ద నోట్లకు ఎక్స్‌ఛేంజ్ ఇవ్వడం లేదు. ఖాతాదారుల అవసరాలను గుర్తించకుండా పెద్దనోట్లను అంటగడుతున్నారు. చాలా ఎటిఎంలలో రెండువేల నోట్లు వస్తున్నాయ్. వాటిని పోస్ట్ఫాసులో మార్చుకుందాం అనిపోతే అక్కడకూడా ‘నో ఛాన్స్’.

03/22/2017 - 01:03

‘స్వదేశీ జాగరణ మంచ్’ (స్వజామ) గతంలో కంటే ఇప్పుడు చెయ్యవలసింది చాలా ఉంది. ఎందుకంటే అవసరమైనప్పుడు ప్రధాని మోదీని నిలబెట్టి ప్రశ్నించగల జాతీయ నాయకులు ఇప్పుడు ఎవ్వరూలేరు, ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ తప్ప. మిగతా అందరూ తమ తమ గ్రామాలకు ‘రాజులు’ మాత్రమే! దేశానికి నాయకులు కారు.

03/21/2017 - 01:11

విద్యార్థులకు సులువుగా పాఠాలు బోధించేందుకు డిజిటల్ తరగతులను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. దృశ్య రూపకంగా బోధించడం వల్ల సాధారణ విద్యార్థులకూ పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయి. అయితే, అనేక పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు అనుగుణగా వసతులు లేవు.

03/20/2017 - 01:06

రేషన్ డిపోల్లో నగదు రహిత లావాదేవీల్లో వినియోగదారులకు అధికారులు నరకం చూపిస్తున్నారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు ఇంటి వద్ద పనులు మానుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు నిరీక్షించవలసి వస్తోంది.

03/18/2017 - 00:59

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మధుమేహం రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిన్న వయసువారు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వారసత్వంగానే గాక, ఎంతోమంది కొత్తగా మధుమేహ పీడితులవుతున్నారు. ఊబకాయం, ఆహారపు అలవాట్లు, వత్తిళ్లు, ఆధునిక జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వల్ల అధిక శాతం ప్రజలు చక్కెర వ్యాధిగ్రస్తులవుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఉన్న కొందరు మాత్రమే సక్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు.

03/17/2017 - 00:57

విశాఖ విమానాశ్రయానికి సింహాద్రి అప్పన్న పేరు పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో సంతోషిస్తారు. గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టుకు ‘ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయం’ అని, తిరుపతి ఎయిర్‌పోర్టుకు ‘శ్రీవేంకటేశ్వర విమానాశ్రయం’ అని పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తాజాగా తీర్మానించింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రస్తావన రాకపోవడం విచారకరం.

03/16/2017 - 07:37

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగా ఆ దేశంలో పరజాతి ద్వేషం పెరుగుతోంది. అమెరికన్ల జాత్యహంకారం వల్ల మన ఇండియన్లకి అక్కడ తల తిరిగి నోట్లోకొస్తోంది. ఇండియాలో ఇక నుంచీ ‘మమీ డాడీ’ చదువులే కొనసాగుతాయా? ‘యా, యా’ వంటి అమెరికన్ ఉచ్ఛారణలే బతికి బట్టకడతాయా? ‘అడ్డమైన చాకిరీ చేసి అయినా సరే అమెరికాలోనే బతకాలి. అందుకే నేను ఇండియాలో పుట్టాను’- అనే మాటనే ఇకముందు కూడా మన యువత కలలు కంటూ ఉంటుందా?

03/15/2017 - 00:26

ఈనెల 28వ తేదీన అమావాస్య ఉదయం 8.27 గంటల వరకు, 29న తెల్లవారు ఝామున 5.45 గంటల వరకు పాడ్యమి ఉన్నాయి. 29వ తేదీ ఉదయానికి పాడ్యమి లేదు. ఆ కారణంగా 28వ తేదీన మాత్రమే తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ని మనం ఆచరించాలి. పూర్వ పద్ధతి పంచాంగములలో ఉదయం ఏడు గంటల వరకూ 29వ తేదీన పాడ్యమి ఉన్నది కాబట్టి ఆ పద్ధతి వారు 29వ తేదీన ఉగాది అంటున్నారు.

03/14/2017 - 00:45

అర్హులు లేకపోతే ‘రిజర్వుడు కేటగిరీ’ కింద కళాశాలల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంచేస్తారే తప్ప ఇతరులకు వాటిని కేటాయించరు. తమ కులాన్ని బిసి జాబితాలో చేర్చాలని కొందరు ఆందోళనలు చేస్తే- అలా కలిపితే సహించేది లేదని ఇప్పటికే ఆ జాబితాలో ఉన్నవారు ప్రతిఘటిస్తారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అయినా ఇతర ప్రాంతాల వారు అక్కడ ఉద్యోగాలు చేయకూడదు, ఆస్తులు కొనరాదు.

03/13/2017 - 01:05

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న జాత్యహంకార ధోరణిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఎదిరించాలి. అమెరికాలో ఉంటున్న భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. వారి ఆస్తిపాస్తులకు భద్రత లేదు. అమెరికాలోని కంపెనీలు ఆహ్వానిస్తేనే భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వారు అక్కడికి వెళ్లారు. ఉన్నత చదువులు, వ్యాపారం, ఉపాధి రంగాల్లో రాణించేందుకు ఎంతోమంది భారతీయులు వివిధ దేశాలకు వెళుతున్నారు.

Pages