S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/25/2017 - 01:53

‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని అలనాడు శ్రీకృష్ణదేవరాయలు మన మాతృభాషను కీర్తించాడు. తె లుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పాశ్చాత్యులు పొగిడారు. ‘మాతృభాష తల్లిపాలు- పరభాష పోతపాలు’-అని జాతిపిత గాంధీజీ నుడివారు. శ్రవణ, భాషణ, పఠన లేఖనాదులనే చతుర్విధ భాషానైపుణ్యాలు పునాదిగా విద్యాసౌధం నిర్మితమవుతుందని, ఆ పునాదులు గుల్లబారితే అది పేకమేడలా కూలిపోతుందని హెచ్చరించారు.

01/24/2017 - 05:40

మనదేశంలో రైలు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ- అందుకు మానవ తప్పిదమా? సిబ్బంది అలసత్వమా? తీవ్రవాదుల విద్రోహమా? అన్న చర్చలు జరుగుతాయే తప్ప రైళ్లలో భద్రతను పెంచేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. సువిశాల భారతదేశంలో ప్రయాణీకుల, సరకుల రవాణాకు రైళ్లే ప్రధాన ఆధారం. అయితే, రైలు ప్రయాణమంటేనే ప్రజలు హడలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది.

01/23/2017 - 00:38

ఏటా లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిని ని యంత్రించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో దీర్ఘవ్యాధులతో మరణిస్తున్న వారిలో 35 శాతం మంది క్యాన్సర్ బారినపడ్డవారే. ఏటా కొత్తగా పది లక్షల మంది క్యాన్సర్ వ్యాధులకు లోనవుతున్నారు.

01/22/2017 - 07:00

ఆమె పేరులోనే ‘మమత’.. కళ్లలో కసి, మాటలో పదును, నడకలో వేగం ఆమె నైజం. ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం, ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేయడం ఆమె స్వభావం. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల సుదీర్ఘపాలనకు తెరదించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న మమతా బెనర్జీ పాలనావ్యవస్థపై కంటే వివాదాలపైనే నిత్యం దృష్టిసారిస్తుంటారు. ఆమె ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే బహిరంగ యుద్ధం ప్రకటించారు.

01/21/2017 - 01:50

తెలుగువారైన శాతవాహన రాజుల తొలి నివాసం తెలంగాణలోని కోటిలింగాల. ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన వంశీయులు అసహాయ శూరులు, అరివీర భయంకరులు. శాతకర్ణి బ్రాహ్మణుడే, బ్రాహ్మణ చక్రవర్తి అని చెప్పడానికి ఎన్నో చారిత్రక పుస్తకాలలో సాక్ష్యాధారాలున్నాయి. అసలు సిసలు బ్రాహ్మణుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే.

01/20/2017 - 01:55

చలికాలం వచ్చిందంటే చాలు స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించడం షరామామూలైంది. ఇది విజృంభిస్తున్నదని వార్తలు వస్తున్నప్పుడే నివారణ కోసం ప్రయత్నాలు జరగడం పరిపాటైంది. స్వైన్‌ఫ్లూ అనేది హెచ్1ఎన్1 అనే వైరస్. దీని బారిన పడ్డ వారికి జ్వరం, గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళనొప్పులు, వాంతి వచ్చినట్లు అనిపించడం సహజం.

01/19/2017 - 05:32

ఏ లోహ నాణానికైనా, పేపరు కరెన్సీకైనా ప్రజలకు వాటి పట్ల కలిగే నమ్మకమే విలువను కలిగిస్తుంది. ఎంత విలువైన నోట్లను, నాణాలనూ ముద్రించాలో రిజర్వు బ్యాంకు నిర్ణయిస్తుంది. దేశంలో ఎంత నగదు చెలామణిలో వుండాలో కొన్ని నిబంధనలకు లోబడి రిజర్వు బ్యాంకు కరెన్సీని ముద్రించి విడుదల చేస్తుంది. ఇలా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నగదుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది.

01/19/2017 - 05:29

సరికొత్త భావాలతో కళకళలాడే తరగతి గది తీరు- ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’లా ఉంటుంది. ప్రతి విద్యార్థి తన ఆలోచనలతో తరగతి గదిని సమ్మేళనం చేసి ఒక కొత్త భావనలను అందిస్తూ ఉంటాడు. ఉపాధ్యాయుడు వీటన్నింటినీ ‘డాక్యుమెంట్’ చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి క్లాసును ఒక ‘్భవాల ప్రపంచం’గా సృష్టించవచ్చు కదా! విద్యార్థి లోకానికి తరగతి ఒక భూమికలా ఉపయోగపడుతుంది. దీనిలో పిల్లలందరూ భాగస్వాములై తమ భావాలను వ్యక్తం చేస్తారు.

01/18/2017 - 00:49

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే, సామ్యవాదాన్ని సమాధి చేసే అరాచక నేతలు రాజ్యమేలినపుడు, దురాగతాలు ప్రజ్వరిల్లినపుడు, నరజాతి అనునిత్యం పరపీడిత బాధితులై రోదించినపుడు ఆయా కాలాలలో గొప్ప వ్యక్తులు అవతరిస్తారు. ప్రజల కన్నీళ్లు తుడిచి, వారి కష్టాలను రూపుమాపి జన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ కోవకు చెందిన విలక్షణ నేత- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు.

01/17/2017 - 01:35

అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ రూపుదాల్చబోతున్న నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతం ఇప్పుడు ఓ బ్రాండ్ నేమ్‌గా ప్రఖ్యాతి పొందుతోంది. దేశంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో దేశంలోనూ, విదేశాల్లోనూ ఆసక్తి పెరిగింది.

Pages