S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టేక్మాల్, జనవరి 21: నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సిన ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఫలితంగా పురుగుల బియ్యంతో భోజనం తయారు. ఇది టేక్మాల్ మండల పరిధిలోని బర్ధీపూర్ ప్రాథమిక పాఠశాలలో గత నాలుగు నెలలుగా జరుగుతున్న తంతు. దీంతో విద్యార్థులు గత్యంతరం లేకపోవడంతో అదే ఆహారాన్ని తింటున్నారు. ఈ విషయాన్ని ‘పురుగుల అన్నం...
మహబూబ్నగర్, జనవరి 21: పరిపాలనను మరింత అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సే వలు అందించేందుకే రాష్ట్రంలో నూ తన సమీకృత భవన సముదాయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
మానవపాడు, జనవరి 21: కొత్తగా ఏర్పడిన ఉండవెల్లి మండల ఎస్ఐ గత కొంతకాలంగా ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఆర్టీసి బస్సు సౌకర్యాలు లేని అలంపూర్ తాలూకాలో ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడి రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
మన్ననూరు,జనవరి 21: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని అటవీ శాఖ సంచారకులు పృద్వీరాజు అన్నారు. శనివారం మన్ననూరు అటవీ శాఖ చెక్పోస్టు సమీపంలోని వనమాలిక సముదాయంలో అటవీ సిబ్బందికి సిసి కెమెరాలు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించారు. గత మూడు నెలలుగా దోమలపెంట, మన్ననూర్ రేంజ్లలో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల గణాంకాలను చేశారన్నారు.
మహబూబ్నగర్, జనవరి 21: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో మ ద్యాహ్న భోజనం (అక్షయపాత్ర) ద్వారా ప్రతి పేదల పిల్లలకు పౌష్టికాహరం అందించే భాద్యత ప్రతి అంగన్వాడీ కార్యకర్తపై, సిడిపిఓపై ఉందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన నూతన చాంబర్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ సిడిపిఓలతో సమావేశమయ్యారు.
మహబూబ్నగర్, జనవరి 21: ప్రమాదాల ను నివారించి దేశ భవిష్యత్తుకు బంగారు బా టలు వేద్దామని మహబూబ్నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జెండాను ఊపి భారీ ర్యాలీని ప్రారంబించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుని హక్కు అని తెలిపారు.
మహబూబ్నగర్, జనవరి 21: మహబూబ్నగర్ జిల్లాలో టి ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న నూతన పారిశ్రామికవేత్తలకు ప్రొత్సహంతో పాటు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.
ఆర్మూర్, జనవరి 21: ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామ శివారులో గల 44వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరణించిన వారిలో మహ్మద్ జావిద్(36), వివేక్(30)లు ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీ, ట్రక్కు ఢీకొన్నాయి.
నిజామాబాద్, జనవరి 21: లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది.
కంఠేశ్వర్, జనవరి 21: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ను ప్రతి రెండు మాసాలకోసారి, రెండవ శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంవి.హరినాథ్ తెలిపారు.