S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/23/2019 - 00:58

కుప్పం, జూలై 22: చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుప్పం మండల పరిధిలోని సామగుట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హనుమప్ప కుమారుడితో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

07/22/2019 - 23:41

ముంబయి, జూలై 22: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులకు పడిన శిక్షలు అంచెనాగా మరెంత కాలం ఉన్నాయో తెలియజేయాలని జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ)ను బాంబే హైకోర్టు కోరింది. 2008నాటి పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సమీర్ కుల్‌కర్ణి తన జైలు శిక్షను మరో ఆరు నెలల్లో ముగించే విధంగా కింది కోర్టును ఆదేశించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

07/22/2019 - 23:20

ముంబయి, జూలై 22: టాటాసన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాతోబాటు ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎనిమిది మంది డైరెక్టర్లకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసు విచారణను ముంబై హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ నేరపూరిత పరువునష్టం దావాను నుస్లీ వాడియా అనే వ్యక్తి దాఖలు చేయడం జరిగింది.

07/22/2019 - 04:39

నవీపేట, జూలై 21: ఎంతో అప్రమత్తంగా వ్యవహరించే మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రం నిర్వాహకులనే ఓ మోసకారి బురిడీ కొట్టించాడు. అచ్చంగా సినీ ఫక్కీలో వారిని మోసగించి 89 వేల రూపాయలతో ఉడాయించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్ల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకోగా, బాధితుడు ఆదివారం పలు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.

07/22/2019 - 04:33

బాలానగర్ : రైతులు తమ పశువులను పొలాల్లో మేపుతుండగా వారిపైకి దూసుకువచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. దాంతో ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచ్చర్‌కల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. తిరుమలాపూర్ గ్రామం నుండి రాజాపూర్‌కు వస్తున్న ఏపీ10 ఎఫ్ 3168 నెంబర్ గల కారు అతివేగంగా రైతులపైకి దూసుకెళ్లింది.

07/22/2019 - 04:11

హైదరాబాద్ / సికింద్రాబాద్, జూలై 21: సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫర్‌మండిలో ఓ పురాతన భవనం కూలి ఓ బాలుడు మృతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలైన సంఘటన సికింద్రాబాద్ చిలకల్‌గూడ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. చిలకల్‌గూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనంలో పాల వ్యాపారం చేస్తున్న రాజు యాదవ్, అతని భార్య స్వాతితో పాటు 14 నెలల బాలుడు గీతాన్ష్‌తో నివాసం ఉంటున్నారు.

07/22/2019 - 04:08

హైదరాబాద్, జూలై 21: ఒక రోగి పట్ల నిర్లక్ష్యం చూపించిన దవాఖానా నుండి ఎనిమిది లక్షల రూపాయల పరిహారాన్ని పౌరసరఫరాల శాఖ వినియోగ సహాయ కేంద్రం అందించి ప్రజల్లో సహాయ కేంద్రం పట్ల నమ్మకం పెంచింది. పరిహారానికి సంబంధించిన చెక్కును బాధితుడికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం అందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిర్సిల్లా జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన పి.

07/22/2019 - 03:54

యాడికి, జూలై 21: పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రంగనాథచౌదరి, సరస్వతి దంపతుల కుమారుడు వినోద్‌కుమార్(23), అదేగ్రామానికి చెందిన వెంకటచౌదరి కుమార్తె చరిత(21) కొనే్నళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

07/22/2019 - 03:38

మంత్రాలయం, జూలై 21: హంపీ సమీపంలోని ఆనెగొందిలో ఉన్న శ్రీవ్యాసరాయల బృందావనాన్ని ధ్వంసం చేసిన ముఠాను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ముఠాసభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవారు కావడం గమనార్హం. ఈ మేరకు నిందితుల వివరాలను కొప్పల్ ఎస్పీ శ్రీమతి రేణుకాసుకుమార్ ఆదివారం వెల్లడించారు.

07/22/2019 - 03:35

మార్కాపురం, జూలై 21: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ అయ్యోరు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిన్నకున్నారు. వేరే పాఠశాలలో తమ చిన్నారిని చేర్పించారు.

Pages