-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మునగాల, జూలై 23: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతిచెందగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
మెదక్, జూలై 23: మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ను వారసులకు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. మెదక్ జిల్లా డీఎంహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. మరో ఉద్యోగి పరారయ్యాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
కల్వకుర్తి, జూలై 23: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. నాగర్కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోని ఉర్కొండపేట గ్రామంలో మంగళవారం బస్సు కింద పడి మనోజ్ఞ (5) అనే చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ఉర్కొండ ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొల్లాపూర్, జూలై 22: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను రాళ్లతో కొట్టి చంపిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన తెలుగు రేణుక (25)ను ఆమె భర్త జలగం మధు (30) వ్యవసాయ పొలంలో రాళ్లతో కొట్టి చంపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తెలుగు రేణుక కేఎల్ఐ క్వార్టర్స్ ముందున్న వ్యవసాయ భూమిలో పని చేయడానికి వచ్చింది.
సంగారెడ్డి, జూలై 22: రిమాండ్లో ఉన్న ఓ మహిళా ఖైదీ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడి డజిల్లా కంది జైలులో సోమవారం సాయంత్రం 3.20 గంటలకు చోటు చేసుకుంది. జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చింతల సరోజ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉండేది.
హైదరాబాద్, జూలై 22: బిగ్బాస్ -2 తెలుగు రియాలిటీ షోపై దాఖలైన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారించింది. బ్రాడ్కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్బాస్ షో ప్రసారం అవుతోందని , సినిమాలను ఎలాగైతే సెన్సార్ చేస్తారో, అదే విధంగా ఈ షోను కూడా సెన్సార్ చేసి ప్రసారం చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, జూలై 22: గనుల అక్రమాల విషయంలో మనీ లాండరింగ్కు పాల్పడిన కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి సోమవారం హాజరయాయరు. మనీ లాండరింగ్కు పాల్పడినట్టు 2007లో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గనుల అక్రమాల విషయంలో గాలి భారీగా మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్, జూలై 22: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత యోచనపై ప్రభుత్వం కట్టుకథలు చెప్పవద్దని, ఉన్నతంగా ఆలోచించి కోర్టు ముందు వాస్తవాలు చెప్పాలని హైకోర్టు సోమవారం నాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పురావస్తు జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని చెప్పిన ప్రభుత్వం, కొద్ది రోజుల క్రితం ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానికి సరైన వివరణ ఇవ్వలేకపోయింది.
గూడెంకొత్తవీధి, జూలై 22: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విన చెరువులో ఈతకు వెళ్ళిన ఇద్దరు గిరిజన విద్యార్థులు మృతి చెందారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీది మండలం దామనాపల్లి పంచాయతీ లింగవరంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాగా మారుమూల గ్రామం కావడంతో విషయం సోమవారం వెలుగుచూసింది. మృతి చెందిన వారిలో సాగిన జానకి జతిన్(9) చింతపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు.
ధర్మవరం, జూలై 22: తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడన్న కోపంతో వావివరసలు మరిచి మారుతల్లి కూతురుపై అత్యాచారం జరిపాడు ఓ ప్రబుద్దుడు. ఈ దారుణం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన తేజప్రతాప్ బేల్దారి పని చేసుకుంటూ తల్లితో కలిసి ఉంటున్నాడు.