S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవర్ పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానున్న నేపథ్యంలో పవన్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడట.
మాస్ హీరో గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్నందా’. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు సంపత్నంది మాట్లాడుతూ- ఇంతకుముందు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కథలు రాసేవాడిని. కానీ ఈ కథలోనే హీరోయిజమ్ ఉంది.
ఒక్కసారి గుర్తింపు వచ్చిందంటే టాలీవుడ్ నుండి కోలీవుడ్కో, మాలీవుడ్డో కాకపోతే బాలీవుడ్కో ఎగిరిపోయి మరిన్ని అవకాశాలు పట్టేయాలని ప్రయత్నిస్తుంటారు హీరోయిన్లు. కానీ రకుల్ప్రీత్సింగ్ అందుకు విరుద్ధం. ఎక్కడైతే గుర్తింపు వచ్చిందో, అక్కడ పూర్తి స్థాయి అవకాశాలను అందుకుంటూ మరోవైపు కనె్నత్తి చూడకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది రకుల్ప్రీత్సింగ్.
నటుడు మోహన్బాబు తనయుడు మనోజ్ హఠాత్తుగా బాంబు పేల్చాడు. తాను ఇక నుండి సినిమాల్లో నటించడంలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ తరువాత మరో చిత్రమే చేస్తున్నానని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అకస్మాత్తుగా మనోజ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. బాలనటుడిగా పరిచయమైన మనోజ్ కెరీర్లో పోటుగాడు, బిందాస్, ప్రయాణం, వేదం లాంటి మంచి చిత్రాలు ఉన్నాయి.
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో జబర్దస్త్ అభీ, సందీప్తి, వరుణ్ ముఖ్యపాత్రల్లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి సమర్పణలో రూపొందిన ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సాగర్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ- ఇదొక విభిన్న తరహా చిత్రం.
బాహుబలి కిరణ్రాజ్ కథానాయకుడిగా ఎం.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో మల్లికార్జున్రెడ్డి, మహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కరాళి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. కెమెరామెన్ సెంథిల్ క్లాప్నివ్వగా, దర్శకుడు వీరశంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
గబ్బర్సింగ్ హిట్ అయినపుడు శృతిహాసన్ కాల్షీట్లకు డిమాండ్ ఏర్పడింది. అంతకుముందు వరకూ ఆమె నటిస్తే చాలు, ఆ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం జరిగింది. బ్లాక్బస్టర్ మూవీగా గబ్బర్సింగ్ నిలబడడంతో శృతిహాసన్కు ఉన్న మచ్చ కాస్త తొలగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో మంచి అవకాశాలు కొట్టేసినా, ఇప్పుడు మాత్రం తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విచిత్రం.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మరకతమణి’. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిక్కీ గల్రాని చెప్పిన విశేషాలు..
అడ్వెంచరస్ థ్రిల్లర్
రక్షిత్, కలర్స్ స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి టాకీస్ పతాకంపై మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. హీరో నిఖిల్, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, సుధీర్ వర్మ, పరశురామ్, అనీల్ రావిపూడి తదితరులు కలిసి టీజర్ను విడుదల చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ- చిన్నికృష్ణ చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఉంటే ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు.
ఇప్పటికే బాలీవుడ్లో పాపులరైన బిగ్బాస్ షో ఇప్పుడు తెలుగులో ప్రసారం కానుంది. ఈ షోకు హోస్ట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్నారు. తెలుగు టీవీ చరిత్రలోనే అతి పెద్ద షోగా దీన్ని రూపొందిస్తోంది స్టార్ మాటీవీ. మొదటిసారిగా ఎన్టీఆర్ టీవీ తెరపైకి అడుగుపెడుతూ చేస్తున్న షో ఇది. హిందీలో సల్మాన్ఖాన్ హోస్ట్గా నిర్వహించిన ఈ షో ఇప్పటికే పది సీజన్లను పూర్తిచేసుకుంది.